News October 12, 2024

శ్రీకాళహస్తి స్వామివారి సేవలో బాలకృష్ణ సతీమణి

image

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితా రెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిహెచ్ఓ నాగభూషణం, ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

Similar News

News October 13, 2024

తిరుపతిలో పెరిగిన చికెన్ అమ్మకాలు

image

గత నెల రోజులుగా పెరటాసి మాసం కారణంగా మాంసం అమ్మకాలు భారీగా తగ్గాయి. పెరటాసి మాసం ముగియడంతో ఆదివారం ఉదయం నుంచి మాంసం అమ్మకాలు జోరందుకున్నాయి. తిరుపతిలో చికెన్ ధరలు బాయిలర్, లింగాపురం రూ.240, లైవ్ రూ.150, స్కిన్ లెస్ చికెన్ రూ.260 కాగా గుడ్లు రూ.4.50 పైగా అమ్మకాలు సాగుతున్నాయి. త్వరలో కార్తీక మాసం కాగా అమ్మకాలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.

News October 13, 2024

SVU : డిగ్రీ ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూన్ నెలలో డిగ్రీ (UG) B.A/B.COM/BSC/BCA/BBA/BA 4వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News October 13, 2024

బాట గంగమ్మ ఆలయం వరకు చేరిన క్యూ లైన్

image

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు అన్ని కంపార్ట్మెంట్ లు నిండిపోయి ప్రస్తుతం బాట గంగమ్మ ఆలయం వద్ద క్యూలైన్ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. శనివారం ఒక్కరోజు 73,684 మంది దర్శనం చేసుకున్నారు. 36,482 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.2.72 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.