News February 24, 2025

శ్రీకాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాల సమర్పించనున్న మంత్రి ఆనం 

image

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వం తరుఫున మంత్రి ఆనం పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొదటి నుంచి సీఎం చంద్రబాబు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ప్రచారం జరిగినా చివరికి ఆనం ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి 25వతేది(మంగళవారం)   స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించున్నారు. 

Similar News

News November 27, 2025

జూబ్లీహిల్స్‌లో GHMC మోడల్ ఫుట్‌పాత్

image

జూబ్లీహిల్స్‌లో జీహెచ్‌ఎంసీ మోడల్ ఫుట్‌పాత్ ప్రాజెక్టు చేపట్టింది. రీసైకిల్ ప్లాస్టిక్ పేవర్లు, సోలార్ గ్రిడ్, టాక్టైల్ పేవింగ్‌తో పాదచారుల భద్రతను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఫిల్మ్‌నగర్- బీవీబీ జంక్షన్ మధ్య ఉన్న బీజీ కారిడార్‌లో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి, పర్యావరణ హితంగా నిర్మించే ఈ ప్రాజెక్టు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 27, 2025

ఖమ్మం: మీడియా సెంటర్ ప్రారంభించిన అ.కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ మొదటి అంతస్తులోని ఎఫ్-3లో ఉన్న డీపీఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు.

News November 27, 2025

ములుగు: పంచాయతీ ఎన్నికలకు 1,306 పోలింగ్ స్టేషన్లు

image

ములుగు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు 217 లొకేషన్లలో 1,306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 146 సర్పంచ్, 1,290 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు 1,880 మంది పీఓలు, 2,010 మంది ఓపీఓలను నియమించారు. 1,566 బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయ్యింది. సర్పంచ్ బరిలో 8మంది కంటే ఎక్కువ మంది ఉంటే అప్పటికప్పుడు ముద్రించేలా ప్రింటింగ్ ప్రెస్‌లను గుర్తించారు.