News August 26, 2024

శ్రీకృష్ణుని ఆలయంలో మంత్రి సవిత ప్రత్యేక పూజలు

image

శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని శ్రీకృష్ణుని ఆలయంలో మంత్రి సవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో పంటలు సుభిక్షంగా పండాలని ప్రజలు సంతోషంగా జీవించాలని కోరుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ ఉత్సవ ఊరేగింపులో పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిపై ఆ శ్రీకృష్ణ భగవానుడి కరుణాకటాక్షం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Similar News

News February 11, 2025

ఆనంతపురం పోలీసుల ప్రజా దర్బార్‌కు 57 పిటీషన్లు

image

అనంతపురం పోలీసుల ప్రజా దర్బార్‌కు 57 పిటీషన్లు వచ్చినట్లు అదనపు ఎస్పీ డి.వి. రమణమూర్తి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజల నుంచి సోమవారం ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదులు పంపి ఆదేశాలు జారీ చేశారు.

News February 10, 2025

రాప్తాడు వైసీపీలో ముసలం

image

రాప్తాడు వైసీపీలో ముసలం నెలకొంది. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. మాధవ్ ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడంపై తోపుదుర్తి వర్గీయులు మండిపడుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఇటీవల ఐదుగురు వైసీపీ నేతలను తోపుదుర్తి సస్పెండ్ చేయించారు. ఈ క్రమంలో తోపుదుర్తిని వ్యతిరేకిస్తూ రామగిరి నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం కలకలం రేపింది.

News February 10, 2025

రాప్తాడు వైసీపీలో ముసలం

image

రాప్తాడు వైసీపీలో ముసలం నెలకొంది. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. మాధవ్ ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడంపై తోపుదుర్తి వర్గీయులు మండిపడుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఇటీవల ఐదుగురు వైసీపీ నేతలను తోపుదుర్తి సస్పెండ్ చేయించారు. ఈ క్రమంలో తోపుదుర్తిని వ్యతిరేకిస్తూ రామగిరి నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం కలకలం రేపింది.

error: Content is protected !!