News March 25, 2025
శ్రీగిరిపై ఉగాది కార్యక్రమాల ఇలా..!

శ్రీశైలం క్షేత్రంలో ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 27న మహాలక్ష్మి అలంకారం, బృంగి వాహన సేవ, 28న మహాదుర్గ అలంకారం, కైలాస వాహన సేవ, 29న మహాసరస్వతీ అలంకారం, ప్రభోత్సవం, నందివాహనసేవ వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం, 30న ఉగాదిన శ్రీ రమావాణిసేవిత రాజరాజేశ్వరి అలంకారం, పంచాంగ శ్రవణం, రథోత్సవం, 31న శ్రీ భ్రమరాంబాదేవి నిజాలంకరణ, పూర్ణాహుతి, అశ్వవాహన సేవ జరుగుతుంది.
Similar News
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 1, 2025
అధ్యక్షా.. కడప – బెంగుళూరు రైలు రోడ్డు కథ కంచికేనా..?

మదనపల్లి జిల్లా కల నెరవేరింది. కడప- బెంగళూరు రైలు రోడ్డు వేస్తామని మరిచారు. అయితే ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన గళం వినిపించి కడప మదనపల్లి మీదుగా బెంగుళూరుకి రైల్వే రోడ్డుకు కృషి చేస్తారా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాజంపేట పరిధిలో బస్ షెల్టర్ల ఏర్పాటుపై చర్చించి, గతంలో మంజూరైన రైల్వే రోడ్డు, బస్ షెల్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తారా? చూడాలి.
News December 1, 2025
NGKL జిల్లాలో తగ్గిన చలి

నాగర్కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే చలి తీవ్రత కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో 18.1°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 18.3°C, తోటపల్లిలో 18.5°C, ఊర్కొండ, వెల్దండలలో 18.6°C, తాడూరులో 18.7°C, చారకొండ మండలంలో 18.8°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


