News March 12, 2025
శ్రీగిరిపై 27 నుంచి ఉగాది మహోత్సవాలు

శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఐదు రోజులు పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. ఉత్సవాల ప్రారంభానికి ముందే నుంచే భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
Similar News
News March 22, 2025
IPL: కాకినాడ కుర్రాడిపైనే దృష్టంతా!

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మామిడికుదురు(M) గోకులమఠంలో పుట్టిన సత్యనారాయణరాజు ఐపీఎల్లో MI తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రంజీ పోటీల్లో 8 మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నారు. ఈ కుర్రాడికి ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందేమో వేచి చూడాలి.
News March 22, 2025
వరంగల్ జిల్లాలో తగ్గుతున్న భూగర్భ జలాలు

వరంగల్ జిల్లాలో వేసవి దృష్ట్యా భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. గతేడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది మరింత లోతుకు పడిపోయాయి. జిల్లాలో దుగ్గొండి, ఖానాపురం, ఖిలా వరంగల్ మినహా మిగతా 10 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపు చేసుకునేందుకు ఇళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలను తవ్వడం, నీటి వృథాను అరికట్టడం వంటి చర్యలు ఉత్తమ మార్గం.
News March 22, 2025
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ హనుమంతరావు

లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారు రుసుము చెల్లించి 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి దాన కిశోర్ హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లే అవుట్ల క్రమబద్ధీకరణపై సమీక్షించారు. 25 శాతం రాయితీ అవకాశం మార్చి31తో ముగియనుందన్నారు.