News March 18, 2024
శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరుతున్నారనేది అసత్యం: డీకే అరుణ

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ BJPలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని బీజేపీ నాయకురాలు DK అరుణ స్పష్టం చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. BJPకి ప్రజలలో ఉన్న ఆదరణను ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలని, ప్రజలను తప్పుదోవ పట్టించాలని అసత్యం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మమ్మల్ని సంప్రదించలేదని పేర్కొన్నారు.
Similar News
News April 10, 2026
మహబూబ్నగర్: రోడ్డు భద్రతపై వీడియో పోటీలు

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు “Arrive Alive” పేరుతో వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. గరిష్ఠంగా 3 నిమిషాల నిడివి గల వీడియోలను రూపొందించి, ఈ నెల 14లోపు ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఉత్తమ వీడియోకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, ప్రమాదాల నివారణే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
News April 10, 2026
మహబూబ్నగర్: రోడ్డు భద్రతపై వీడియో పోటీలు

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు “Arrive Alive” పేరుతో వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. గరిష్ఠంగా 3 నిమిషాల నిడివి గల వీడియోలను రూపొందించి, ఈ నెల 14లోపు ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఉత్తమ వీడియోకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, ప్రమాదాల నివారణే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
News April 10, 2026
MBNR: పెరుగుతున్న ఎండలు.. ప్రజల బెంబేలు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్లో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. భూత్పూర్ మండలం కొత్త మొల్గర 40.7, కౌకుంట్ల 40.6, భూత్పూర్ 40.3, నవాబుపేట 45.2, చిన్న చింతకుంట 40.0, మూసాపేట మండలం జానంపేట 39.7, అడ్డాకుల, మహమ్మదాబాద్, దేవరకద్ర 39.6, మిడ్జిల్ మండలం దోనూరు, మహబూబ్ నగర్ గ్రామీణం 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


