News August 15, 2024
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 13.87 క్యూసెక్కుల నీరు నిలువ

ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకు 477.51 అడుగులకు గాను ప్రస్తుతం 13.87 టిఎంసిలు నీరు నిల్వ ఉంది ఉంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 2,518 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా 3,810 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.
Similar News
News November 17, 2025
KNR: ప్రజావాణికి 288 దరఖాస్తులు

సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి 288 అర్జీలను స్వీకరించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆమె ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సత్వర పరిష్కారం కోసం అర్జీలను సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
News November 17, 2025
KNR: NTR వీరాభిమాని గుండెపోటుతో మృతి

రాజకీయాల్లో చంద్రబాబు నాయడు కంటే సీనియర్, NTR వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య గుండెపోటుతో KNRలో మృతి చెందారు. TDP ఆవిర్భావం నుంచి ఆగయ్య పార్టీని వీడకుండా పనిచేస్తూ ఎన్టీఆర్ వీరాభిమానిగా గుర్తింపు పొందారు. పేరు పెట్టి పిలిచేంతగా, ఎన్టీఆర్ కుటుంబంలో తెలిసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సేవలను గుర్తించి మహానాడు కార్యక్రమంలో ఆగయ్యను సన్మానించారు కూడా.
News November 17, 2025
KNR: NTR వీరాభిమాని గుండెపోటుతో మృతి

రాజకీయాల్లో చంద్రబాబు నాయడు కంటే సీనియర్, NTR వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య గుండెపోటుతో KNRలో మృతి చెందారు. TDP ఆవిర్భావం నుంచి ఆగయ్య పార్టీని వీడకుండా పనిచేస్తూ ఎన్టీఆర్ వీరాభిమానిగా గుర్తింపు పొందారు. పేరు పెట్టి పిలిచేంతగా, ఎన్టీఆర్ కుటుంబంలో తెలిసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సేవలను గుర్తించి మహానాడు కార్యక్రమంలో ఆగయ్యను సన్మానించారు కూడా.


