News March 28, 2025

శ్రీరాంపూర్: పలువురు సింగరేణి అధికారులు బదిలీ

image

పలువురు మైనింగ్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న మొత్తం 11 మంది అధికారులను బదిలీ చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓసీలో ఎస్ఈగా పనిచేస్తున్న రామారావును శ్రీరాంపూర్ ఏరియాలోని ఎంవీటీసీకి బదిలీ చేశారు. అలాగే మణుగూరు పీకే ఓసి డీవైఎస్ఈ మిట్టపల్లి శ్రీనివాసరావు శ్రీరాంపూర్ ఓస 2కు బదిలీ అయ్యారు.

Similar News

News December 13, 2025

సైబర్‌ నేరగాళ్లపై కరీంనగర్‌ సీపీ ఉక్కుపాదం

image

టెక్నాలజీపై పట్టున్న కరీంనగర్ CP గౌస్ ఆలం ఆర్థిక నేరగాళ్లను వేటాడుతున్నారు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసును చేధిస్తూ బాధితులలో భరోసా నింపుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన మేటా ఫండ్ కింగ్ పిన్ లోకేశ్వర్‌ను పట్టుకొని కటకటాల్లోకి పంపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 281 సైబర్ కేసులు నమోదయ్యాయి. రూ.90,77,918 రికవరీ చేసి బాధితులకు అందించారు.

News December 13, 2025

బిగ్‌బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

image

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్‌లో సంజన/భరణి/డెమోన్ పవన్‌లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.

News December 13, 2025

రాజయ్యపేట: ‘బల్క్ డ్రగ్ పార్క్‌కు అంగీకరించే ప్రసక్తే లేదు’

image

సీఎం చంద్రబాబుతో ఈనెల 16వ తేదీన భేటీ అయ్యే మత్స్యకార ప్రతినిధులు శనివారం నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సమావేశం అయ్యారు. బల్క్ డ్రగ్ పార్క్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని వారు నిర్ణయం తీసుకున్నారు. బొమ్మల పరిశ్రమ, షుగర్ ఫ్యాక్టరీలు లాంటి ప్రజలకు హాని కలగని పరిశ్రమల ఏర్పాటుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వారు పేర్కొన్నారు. సీఎంతో మాట్లాడే అంశాలపై మత్స్యకార నాయకులు చర్చించారు.