News March 28, 2025
శ్రీరాంపూర్: పలువురు సింగరేణి అధికారులు బదిలీ

పలువురు మైనింగ్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న మొత్తం 11 మంది అధికారులను బదిలీ చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓసీలో ఎస్ఈగా పనిచేస్తున్న రామారావును శ్రీరాంపూర్ ఏరియాలోని ఎంవీటీసీకి బదిలీ చేశారు. అలాగే మణుగూరు పీకే ఓసి డీవైఎస్ఈ మిట్టపల్లి శ్రీనివాసరావు శ్రీరాంపూర్ ఓస 2కు బదిలీ అయ్యారు.
Similar News
News December 4, 2025
ప.గో: 594 కిలోల గంజాయి ధ్వంసం

పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ స్టేషన్లలో పట్టుబడ్డ గంజాయిని ధ్వంసం చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గుంటూరు జిల్లా కొండవీడు పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వద్ద ఈ ప్రక్రియ నిర్వహించామన్నారు. మొత్తం 21 కేసులకు సంబంధించిన 594.844 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. ఈ ప్రక్రియకు సహకరించిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News December 4, 2025
పుతిన్ పర్యటనతో భారత్కు లాభమేంటి?

* రెసిప్రోకల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్(RELOS): ఈ ఒప్పందం ద్వారా భారత్కు సైనిక సహకారం, యుద్ధ నౌకలు, విమానాలకు లాజిస్టిక్ సపోర్ట్ దొరుకుతుంది. గగనతలాలను వాడుకోవడం సులభతరమవుతుంది.
* రష్యా న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ను భారత్కు లీజుకు ఇవ్వనుంది. ఈ డీల్ విలువ $2 బిలియన్లు. దీనిద్వారా ఇండియా సముద్ర సరిహద్దులు మరింత బలోపేతమవుతాయి.
News December 4, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గంటల వ్యవధిలోనే <<18465069>>మరోసారి<<>> బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఇవాళ రూ.920 తగ్గి రూ.1,29,660కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.850 పతనమై రూ.1,18,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


