News February 18, 2025

శ్రీరాంపూర్: బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి: CMD

image

సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కంపెనీ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సంస్థ CMD బలరామ్ సూచించారు. సోమవారం సింగరేణి భవన్ నుంచి జీఎంలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా ఏరియాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలు.. ఇప్పటి వరకు సాధించిన పురోగతిని తెలుసుకున్నారు. రానున్న 43 రోజుల్లో మిగిలిన లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా సాధించాలని ఆదేశించారు.

Similar News

News November 23, 2025

నాగచైతన్య కొత్త మూవీ టైటిల్ వచ్చేసింది

image

అక్కినేని నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రివీల్ చేశారు. ‘వృషకర్మ’ టైటిల్‌తో నాగచైతన్య యాంగ్రీ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను Xలో పోస్ట్ చేశారు. చైతూకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ సాలిడ్‌గా ఉందని మహేశ్ పేర్కొన్నారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News November 23, 2025

NRPT: భూనిర్వాసిత సంఘం అధ్యక్షుడి మశ్చీందర్ బాగ్లి మృతి

image

నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ భూనిర్వాసిత సంఘం అధ్యక్షుడు మశ్చీందర్ బాగ్లి శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కృష్ణ మండలం హిందూపూర్‌కి చెందిన మశ్చీందర్ భూ నిర్వాసితుల పక్షాన నిలబడి అనతి కాలంలోనే ఓ నాయకుడి ఎదిగారు. 60 రోజుల పాటు భూ నిర్వాసితుల సమస్యలపై వివిధ పార్టీలతో కలిసి సమిష్టిగా పోరాటం చేశారు. ఆయన మరణం జిల్లాలో నిరాశను నింపింది. పలువురు నాయకులు, రైతులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

News November 23, 2025

జనగామ: నేడే ఎన్ఎంఎంఎస్ పరీక్ష..!

image

కేంద్ర ప్రభుత్వం 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు అందించే రూ.12 వేల ఉపకార వేతనానికి సంబంధించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఆదివారం జరగనుంది. ఇందుకు జనగామ జిల్లాలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 729 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పర్యవేక్షణకు నలుగురు చీఫ్ సూపరింటెండెంట్ లు, నలుగురు డిపార్ట్మెంట్ ఆఫీసర్లను, 40 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.