News July 25, 2024

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. @61 ఇయర్స్..!

image

ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నదిపై రాష్ట్రంలో నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నేటితో 61 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న అప్పటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు శంకుస్థాపన చేయగా, 1978లో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రజలకు తాగు, సాగు నీరు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది.

Similar News

News October 19, 2025

రైఫిల్ షూటింగ్లో సత్తా చాటిన ఆర్మూరు FBO సుశీల్

image

అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి క్రీడ పోటీలో ఆర్మూరు రేంజ్ FBO బాస సుశీల్ కుమార్ ప్రతిభ కనబరిచారు. సెప్టెంబర్-అక్టోబర్ నెలలో రాష్ట్ర సాయి పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బాసర జోన్ లెవెల్లో నిర్వహించిన మెన్స్ రైఫిల్ షూటింగ్లో మొదటి విజేతగా సుశీల్ నిలిచారు. అలాగే హైదరాబాదులోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఈనెల 18న రాష్ట్రస్థాయి పోటీల్లో 2వ విజేతగా నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు.

News October 19, 2025

నిజామాబాద్: 3,500 ఎకరాలల్లో ఆయిల్ పామ్ సాగు: కలెక్టర్

image

లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. కలెక్టరేట్‌లో శనివారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీని నిర్వహిస్తున్న కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగుకు తగు సూచనలు చేశారు.

News October 19, 2025

నిజామాబాద్: ధాన్యాన్ని వెంటనే అన్‌లోడింగ్ చేసుకోవాలి: కలెక్టర్

image

కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం నిల్వలను రైస్ మిల్లుల వద్ద వెంటనే అన్ లోడింగ్ చేసుకునేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ధాన్యం దిగుమతి చేసుకున్న వెంటనే ట్రక్ షీట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రుద్రూర్, పొతంగల్, కోటగిరి మండలం కొత్తపల్లిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు.