News April 5, 2025
శ్రీరామనవమికి నిర్లక్ష్యం వహించొద్దు: భద్రాద్రి కలెక్టర్

సీతారామచంద్ర స్వామి కళ్యాణం, పట్టాభిషేకం మహోత్సవానికి వివిధ సెక్టార్లలో విధులు నిర్వహించే అధికారులు 6వ తేదీ ఉదయం 6 గంటలకు తమ విధులలో అందరూ హాజరు కావాలని నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమయంలో కలెక్టర్ మాట్లాడుతూ.. సిబ్బంది, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Similar News
News November 21, 2025
టెట్ దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగియనుంది. ఇప్పటివరకు 1,97,823 అప్లికేషన్లు వచ్చాయి. పురుషులు 66,104, మహిళలు 1,31,718 మంది దరఖాస్తు చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకూ TET తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 17,883 మంది టీచర్లూ టెట్కు అప్లై చేశారు. అయితే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలైనందున తమకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుందని టీచర్లు ఆశిస్తున్నారు.
News November 21, 2025
పల్నాడు వీరుల ఉత్సవాలలో నేడు మందపోరు

పల్నాడు వీరుల ఉత్సవాలలో మూడో రోజు శుక్రవారం మందపోరు నిర్వహించనున్నారు. మలిదేవ, బ్రహ్మన్న పరివారం అరణ్యవాస సమయంలో నల్లమల మండాది ప్రాంతంలో ఆవులను మేపేవారు. కుట్రతో నాగమ్మ వర్గీయులు ఆవులను వధిస్తారు. ఆవులు రక్షించుకునేందుకు లంకన్న భీకర యుద్ధం చేసి వీర మరణం పొందుతాడు. దీంతో బ్రహ్మనాయుడు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. నాడు కుల మతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు చేపట్టిన చాప కూడు సిద్ధాంతం నేటికీ కొనసాగుతోంది.
News November 21, 2025
నాగార్జునసాగర్-శ్రీశైలం వెళ్తున్నారా?.. మీ కోసమే

నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతీ శనివారం సాగర్ జలాశయం నుంచి కృష్ణా నదిలో నల్లమల అటవీ అందాల నడుమ సాగే ఈ లాంచీ ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు వెల్లడించారు. లాంచీ ప్రయాణానికి సంబంధించిన టికెట్ ధరలను అధికారులు ప్రకటించారు. వన్ వే ప్రయాణం పెద్దలకు రూ.2 వేలు, 5 – 10 పిల్లలకు రూ.1600లుగా ధర నిర్ణయించారు.


