News April 3, 2025

శ్రీరామనవమి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్‌‌కు ఆహ్వానం 

image

నడిగూడెం మండలం వేణుగోపాలపురంలో ఏప్రిల్ 6 న జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌ను ఆలయ ధర్మకర్త కొల్లు క్షత్రయ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానించారు. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఆహ్వానంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

Similar News

News November 6, 2025

బడికిరాని విద్యార్థులను తిరిగి తీసుకువచ్చే బాధ్యత CRPలదే: DSE

image

AP: బడికిరాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారు తిరిగి స్కూళ్లకు వచ్చేలా CRPలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. వెబ్‌ఎక్స్ మీటింగ్‌లో కమిషనర్ సమీక్షించారు. స్కూళ్లకు రాని వారికి హాజరు వేసినట్లు గుర్తిస్తే టీచర్లు, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. SSC పరీక్షల కోసం విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను రూపొందించామన్నారు. దీన్ని ప్రభుత్వ స్కూళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పారు.

News November 6, 2025

ఆస్ట్రేలియాపై భారత్ విక్టరీ

image

నాలుగో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 48 రన్స్ తేడాతో విజయం సాధించింది. 168 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌ 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. టీమ్ ఇండియా బౌలర్లలో సుందర్ 3, అక్షర్, దూబే చెరో 2, వరుణ్, అర్ష్‌దీప్, బుమ్రా తలో వికెట్ తీశారు. దీంతో భారత్ 5 టీ20 సిరీస్‌లో 2-1తో లీడ్‌లో నిలిచింది. చివరి టీ20 ఈనెల 8న జరగనుంది.

News November 6, 2025

తిరుమలలో అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు

image

అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి FIFO (First In First Out) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి. ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.