News February 19, 2025
శ్రీలత రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే!

BJP జిల్లా పార్టీ పగ్గాలు తొలిసారి మహిళ చేతిలోకి వెళ్లాయి. జిల్లా అధ్యక్షురాలిగా నేరేడుచెర్లకు చెందిన శ్రీలతరెడ్డిని అధిష్ఠానం నియమించింది. 2019లో BRSతో రాజకీయప్రస్థానం మొదలుపెట్టిన ఈమె నేరేడుచెర్ల మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్గా పనిచేశారు. 2023లో MP ఈటల సమక్షంలో BJPలో చేరి HNR నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగా ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్ BJPలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
Similar News
News October 19, 2025
గాజాపై దాడికి హమాస్ ప్లాన్!.. హెచ్చరించిన US

గాజాలోని పౌరులపై దాడి చేయాలని హమాస్ ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా హెచ్చరించింది. ఈ విషయంలో తమకు విశ్వసనీయ సమాచారం ఉందని US విదేశాంగ శాఖ తెలిపింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పింది. మీడియేషన్ ద్వారా సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఒకవేళ హమాస్ దాడి చేస్తే ప్రజలను, సీజ్ఫైర్ ఒప్పందాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
News October 19, 2025
వనపర్తి: జనుంపల్లి వంశస్థుల రాజ ప్రసాదం

నాడు రాజుల పాలనలో ఉన్న నిర్మాణాలు నేడు చరిత్రకు సాక్షాలుగా నిలుస్తున్నాయి. నిజాం కాలంలో సామంత రాజులుగా కొనసాగిన జనుంపల్లి వంశస్థులు మొదట్లో సుగూరు, తర్వాత వనపర్తి ప్రాంతాన్ని సంస్థానం కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. దేశానికి స్వతంత్రం వచ్చే వరకు వీరి పాలన కొనసాగింది.1885లో పట్టణం నడిబొడ్డులో “రామ్ సాగర్ బంగ్లా” నిర్మాణం చేశారు. ప్రస్తుతం ఈ బంగ్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నడుస్తోంది.
News October 19, 2025
యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు: SI

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసి, మరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన యువకుడిపై కారంచేడు SI ఖాదర్ బాషా శనివారం కేసు నమోదు చేశారు. SI వివరాల మేరకు.. కారంచేడుకు చెందిన ఓ యువతిని వరసకు బావ అయ్యే యువకుడు వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడు. యువకుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసి యువకుడి తల్లిదండ్రులను ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.