News July 20, 2024
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనిత

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతంరం ఆమె శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
Similar News
News October 16, 2025
కల్యాణ రేవు జలపాతంలో యువకుడి గల్లంతు

పలమనేరు రూరల్ మండలంలో కళ్యాణ రేవు జలపాతంలో గురువారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతయ్యాడు. పట్టణానికి చెందిన యూనిస్ (23) స్నేహితులతో కలిసి జలపాతం చూడటానికి వచ్చి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్నేహితులు సమాచారం అందించారు. కాగా దట్టమైన అడవిలో నెలకొన్న ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు వర్షం అడ్డంకిగా మారింది. పూర్తి సమాచారం పోలీసులు వెళ్లాడించాల్సి ఉంది.
News October 16, 2025
తోతాపురం సబ్సిడి పడలేదా.. ఇలా చేయండి.!

తోతాపూరి మామిడి రైతులకు అందించిన సబ్సిడీపై సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. తమ సందేహాలను 08572-242777 నంబర్ ద్వారా తెలుసుకోవచ్చాన్నారు. అర్హత ఉన్నా నగదు జమకాని రైతులు రైతు సేవా కేంద్రాలు, హార్టికల్చర్ కార్యాలయాలలో ఈనెల 30లోపు వినతి పత్రాలు అందజేయాలన్నారు. రెండు రోజుల్లో వాటిని పరిష్కరిస్తామన్నారు.
News October 16, 2025
ఏమాత్రం క్రేజ్ తగ్గని రాగి సంగటి, నాటుకోడి కూర.!

ప్రాచీన కాలంగా చిత్తూరుతోసహా సీమవాసుల ఆహారంలో రాగి సంగటి, నాటు కోడి పులుసు భాగమైంది. గతంలో పండుగలు, శుభకార్యాల సమయంలో దీనికి గ్రామాలలో అధిక ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు కూడా దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రాగులు, బియ్యంతో వండే సంగటి, నాటుకోడి ముక్కలతో ప్రత్యేకంగా తయారు చేసే పులుసు భోజన ప్రియులు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. పలు హోటల్లలోను ఇది స్పెషల్ మెనూగా ఉంటుంది.
# నేడు ప్రపంచ ఆహార దినోత్సవం.