News February 3, 2025
శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజ

శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజను సోమవారం వసంత పంచమి సందర్భంగా వైభవంగా నిర్వహించారు. గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విశేషపూజను ఏడాదికోసారి నిర్వహించారు.
Similar News
News November 20, 2025
HYD: కుర్రకారు.. డేటింగ్ యాప్స్తో జాగ్రత్త..!

డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం పెంచుకొని, నమ్మకం కలిగిన తర్వాత మత్తు పదార్థాల రుచి చూపించి, ఒక్కసారి సరదా పేరుతో యువతను గంజాయి సహా వివిధ రకాల డ్రగ్స్ వలయంలోకి లాగుతున్నట్లు HYDలో పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News November 20, 2025
HYD: జెరియాట్రిక్ సేవలను విస్తరించాలి: మంత్రి

హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్లో జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో వచ్చే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని హాస్పిటళ్లలోనూ జెరియాట్రిక్ సేవలను విస్తరించాలని మంత్రి సూచించారు.
News November 20, 2025
HYD: జెరియాట్రిక్ సేవలను విస్తరించాలి: మంత్రి

హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్లో జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో వచ్చే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని హాస్పిటళ్లలోనూ జెరియాట్రిక్ సేవలను విస్తరించాలని మంత్రి సూచించారు.


