News February 26, 2025

శ్రీవారి భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : BR నాయుడు

image

శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇటీవల ఛైర్మన్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి వాట్సాప్ ద్వారా చేసిన దానిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్‌గా గుర్తించారు. శ్రీవారి భక్తులను మోసం చేసే ఏ ఒక్కరిని ఊపేక్షించమని, దళారులు, మోసగాళ్లపై కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News October 15, 2025

కేసుల త్వరగా పరిష్కరించాలి: రామగుండం సీపీ

image

క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేసుల పరిష్కార శాతం పెంపు, పాత/దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న (UI&PT)కేసుల త్వరగా పరిష్కరించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. MNCLజోన్ పోలీస్ అధికారులతో బుధవారం నేర సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్ధతిని కూడా అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలన్నారు. నిందితులకు కోర్టులో శిక్షలు పడే విధంగా సాక్షాదారాలను కోర్టుకు అందజేయాలని సూచించారు.

News October 15, 2025

సాయంకాలం నిద్రపోతున్నారా?

image

పగలు ముగిసి, రాత్రి మొదలయ్యే సమయంలో దేవతలందరూ శివ తాండవ వీక్షణలో తన్మయత్వం పొందుతూ ఉంటారు. అందువల్ల దైవ రక్షణ ప్రభావం కొంత మేర తగ్గుతుంది. ఈ అవకాశాన్ని అసుర శక్తులు వాడుకుంటాయి. ప్రజలను బాధించడానికి నిద్ర రూపంలో మనలోకి ప్రవేశించాలని చూస్తాయి. ఈ బలహీనతలకు మనం లొంగితే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ వేళలో నిద్ర పోవద్దని పెద్దలు అంటుంటారు. * మరిన్ని ధర్మ సందేహాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 15, 2025

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: అదనపు కలెక్టర్

image

గూడూరు మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలోని వంట గది, డైనింగ్ హాల్, స్టాక్ రూమ్‌లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు.