News February 15, 2025

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

image

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 64,527 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,129 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుని హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ శనివారం వెల్లడించింది.

Similar News

News November 22, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో స్వల్పంగా తగ్గిన చలి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు స్వల్పంగా చలి తీవ్రత తగ్గింది. గడచిన 24 గంటల్లో కల్వకుర్తి మండల తోటపల్లిలో 18.4 కనిష్ఠ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సిరసనగండ్ల, అమ్రాబాద్ 18.9, వెల్దండ 19.2, యంగంపల్లి 19.3, బిజినేపల్లి, ఊర్కొండ 19.4, తెలకపల్లి 19.5, ఎల్లికల్ 19.7, వటవర్లపల్లి 19.8, కొండారెడ్డిపల్లి 19.9 కనిష్ఠ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News November 22, 2025

NZB: పసుపు, కుంకుమ చల్లి.. గుప్త నిధుల కోసం తవ్వకాలు

image

నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో గుప్త నిధుల తవ్వకాల ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఘన్‌పూర్ గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం కొందరు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకుని ఐదుగురిని పట్టుకుని వర్నిపోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

News November 22, 2025

బ్లడ్‌ గ్రూప్‌ డైట్‌ గురించి తెలుసా?

image

కొన్నిరకాల ఆహార పదార్థాలలో ‘లెక్టిన్‌లు’ అనే ప్రొటీన్లు ఉంటాయి. ఇవి బ్లడ్‌ గ్రూప్‌ యాంటి జెన్‌ను బట్టి రక్తంలో చేరి అనారోగ్యానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే బ్లడ్‌ గ్రూప్‌ను బట్టి ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. A: పండ్లు, కూరగాయలు, టోఫు, బీన్స్‌, చిక్కుళ్లు, తృణధాన్యాలు ఎక్కువగా, టమాట, వంకాయ, గోధుమలు, జొన్న, పాల ఉత్పత్తులు తక్కువగా తీసుకోవాలి.