News February 15, 2025
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 64,527 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,129 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుని హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ శనివారం వెల్లడించింది.
Similar News
News October 21, 2025
వరంగల్: కాంగ్రెస్లో గులాబీ ముళ్లు

WGL ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఎప్పుడైనా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తాయి. ఇప్పుడు మళ్లీ కొండా వివాదంలో అదే నడుస్తోంది. మేడారం టెండర్ల వివాదం నుంచి ఓఎస్డీ సరెండర్ వరకూ కొండా చుట్టూ ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై నేతల మాటలకు మూతపడ్డాయి. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య బీసీ మహిళ మంత్రిని తొలగించేందుకు కడియం ప్రయత్నిస్తున్నాడని చెప్పడం దుమారం రేపింది.
News October 21, 2025
కూటమి VS కూటమి.. ప్రత్యర్థుల విమర్శలు

బిహార్లో మహా కూటమిలో విభేదాలు ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలుగా మారాయి. కాంగ్రెస్, RJD, CPI, VIP పార్టీలు గ్రాండ్ అలయెన్స్గా ఏర్పడ్డాయి. అయితే 11 స్థానాల్లో కూటమి నేతలే పరస్పరం పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు. 6 సీట్లలో RJD, కాంగ్రెస్, 4 స్థానాల్లో కాంగ్రెస్, CPI, మరో 2 చోట్ల RJD, VIP అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. NDA గెలుపునకు కూటమి బాటలు వేసిందని LJP చీఫ్ చిరాగ్ పాస్వాన్ విమర్శించారు.
News October 21, 2025
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా: కేటీఆర్

TG: తమ పార్టీలో ఉన్నామంటున్న MLAల పేర్లు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉండటం ఏంటని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రశ్నించారు. ‘ఏ పార్టీలో ఉన్నావంటే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వారికి సిగ్గుందా?’ అని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆలిండియా కరప్షన్ కమిటీ అని, దానికి ఖర్గే, రాహుల్ గాంధీ నాయకులని ఖైరతాబాద్లో బస్తీ దవాఖానా సందర్శన సందర్భంగా KTR విమర్శించారు.