News March 1, 2025
శ్రీశైలంలో అలరించిన మహిళల కోలాటం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైలంలో శుక్రవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మహిళల కోలాటం భక్తులను అలరించింది. ముందుగా నిత్య కల్యాణ మండపంలో సదస్యం – నాగవల్లి కార్యక్రమాలు జరిపించి సదస్యం జరిపించారు. కార్యక్రమంలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్తోత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లను స్తుతిస్తారు. ఆగమ శాస్త్రం సంప్రదాయం మేరకు అమ్మవారికి మెట్టెలు, నల్లపూసలు సమర్పించారు.
Similar News
News November 13, 2025
ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో రష్మి అయ్యర్కు గోల్డ్ మెడల్

దక్షిణాఫ్రికాలోజరిగిన ప్రపంచ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో నాగ్పూర్కు చెందిన రష్మీఅయ్యర్ గోల్డ్ మెడల్ గెలిచి రికార్డు సృష్టించారు. ఇందులో 22 దేశాల నుండి 390 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. గతేడాది కజకిస్తాన్లో జరిగిన ఛాంపియన్షిప్లో కూడా గోల్డ్ మెడల్ సాధించిన ఆమె వరుసగా రెండుసార్లు ఈ ఘనత సాధించి రికార్డు సృష్టించారు. గతేడాది స్పాన్సర్లు లేకపోవడంతో ఆమె తన బంగారం అమ్మి పోటీల్లో పాల్గొన్నారు.
News November 13, 2025
బాపట్లలో ఇంటర్ యువకుడు మిస్సింగ్

బాపట్లలో ఓ ఇంటర్ యువకుడు అదృశ్యమయ్యాడు. కర్లపాలేనికి చెందిన సాయినాథ్(16) బాపట్లలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. నిన్న ఉదయం నుంచి కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు. ‘నేను విజయవాడకు వెళ్తున్నా’ అని సాయినాథ్ తన ఫ్రెండ్స్కు చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు గాలిస్తున్నారు. ఎవరికైనా తెలిస్తే 8374922001 నంబర్కు కాల్ చేయాలని బంధవులు కోరుతున్నారు.
News November 13, 2025
HYD: మనం తాగే మినరల్ వాటర్ సేఫేనా?

నగరంలో పుట్టగొడుగుల్లాగా వెలసిన RO ప్లాంట్లపై అధికారుల తనిఖీలు ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కీళ్లనొప్పులు, హెయిర్లాస్ వంటి సమస్యలు ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ వల్లే వస్తాయనే అధ్యయనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ ప్లాంట్లలో, డబ్బాలో నీళ్లు తెచ్చుకోవాలనే కనీస అవగాహన కరవైందని వాపోతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి, ప్లాంట్లపై స్పష్టమైన నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


