News March 25, 2025

శ్రీశైలంలో ఎటు చూసినా భక్తుల వాహనాలే!

image

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రానికి లక్షలాది మంది కర్ణాటక భక్తులు తరలివస్తుండటంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు వాహనాలతో పాటు పాదయాత్ర ద్వారా ఆలయానికి చేరుకుంటున్నారు. అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా కర్ణాటక భక్తులకు చెందిన వాహనాలు దర్శనమిస్తున్నాయి. పార్కింగ్ ప్రదేశాలతో పాటు రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలుపుకుంటున్నారు.

Similar News

News November 21, 2025

అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించండి: ఎంపీ చిన్ని

image

ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి పనులను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీ కేశినేని చిన్ని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న పనులపై అధికారులతో ఆయన సమీక్ష చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న‌, ఆల‌య ఛైర్మ‌న్ బొర్రా గాంధీ, ఈవో శీనానాయక్‌తో కలిసి మహామండపం, కనకదుర్గనగర్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు.

News November 21, 2025

23న పెళ్లి.. స్మృతికి మోదీ గ్రీటింగ్స్

image

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 23న ఆమె తన ప్రియుడు పలాశ్ ముచ్చల్‌తో ఏడడుగులు వేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంధాన-ముచ్చల్ జోడీకి గ్రీటింగ్స్ తెలుపుతూ లేఖ రాశారు. వివాహ బంధంలో ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాగా స్మృతి-పలాశ్ ఎంగేజ్‌మెంట్ ఇప్పటికే పూర్తయింది.

News November 20, 2025

వికారాబాద్‌లో టెట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి- స్పీకర్

image

జనవరి 3 నుంచి 31, 2026 వరకు జరిగే తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)-2026 అభ్యర్థుల సౌకర్యార్థం వికారాబాద్ జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రత్యేకంగా లేఖ రాశారు.