News March 25, 2025
శ్రీశైలంలో ఎటు చూసినా భక్తుల వాహనాలే!

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రానికి లక్షలాది మంది కర్ణాటక భక్తులు తరలివస్తుండటంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు వాహనాలతో పాటు పాదయాత్ర ద్వారా ఆలయానికి చేరుకుంటున్నారు. అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా కర్ణాటక భక్తులకు చెందిన వాహనాలు దర్శనమిస్తున్నాయి. పార్కింగ్ ప్రదేశాలతో పాటు రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలుపుకుంటున్నారు.
Similar News
News November 25, 2025
ASF: ‘రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం’

స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని BJP జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, MAL డా.హరీష్ బాబు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ వెంకటేష్ ధోత్రేకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని 335 సర్పంచ్ స్థానాల్లో కేవలం 20 మాత్రమే బీసీలకు కేటాయించడాన్ని ఖండించారు. బెజ్జూర్లో ఒక్క సీటు కూడా బీసీలకు ఇవ్వలేదన్నారు. చట్టప్రకారం 23% రిజర్వేషన్ ఇవ్వలేదని, వెంటనే సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
News November 25, 2025
ఖమ్మం బస్టాండ్ వద్ద డ్రైనేజీలో మృతదేహం

ఖమ్మం నూతన బస్ స్టేషన్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని, కుడి చేతికి సూర్యుడి టాటూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి సమాచారంతో అక్కడకు చేరుకున్న సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాస్ మృతదేహాన్ని డ్రైనేజీ నుంచి వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని టూ టౌన్ పోలీసులు కోరారు.
News November 25, 2025
SKLM: మృత్యువుగా మారిన 3 చక్రాల బండి

మందస మండలం వీజీపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సింహాచలం (43) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సింహాచలం 3 చక్రాల స్కూటీపై జాతీయరహదారిపై ప్రయాణిస్తున్నాడు. ప్రమాదవశాత్తు అది బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108లో హరిపురం సీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. మందస పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


