News March 25, 2025

శ్రీశైలంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు: ఎస్పీ

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో జరగనున్న ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్రం నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మంగళవారం తెలిపారు. ప్రత్యేకించి క్షేత్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Similar News

News December 7, 2025

రాజమండ్రిలో నేటి చికెన్ ధరలు ఇలా

image

రాజమండ్రి మార్కెట్లో ఆదివారం చికెన్, మటన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. స్కిన్ లెస్ చికెన్ ధర కేజీ రూ.250గా ఉండగా, స్కిన్ చికెన్ రూ.230కి విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ.140-150 మధ్య లభిస్తోంది. ఇక, మటన్ ధర కేజీకి రూ.900గా ఉంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు నమోదవుతున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News December 7, 2025

మహానటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మాణం: MP బాలశౌరి

image

మహానటి సావిత్రి పేరుతో ఆమె జన్మస్థలమైన గుంటూరు జిల్లా చిర్రావూరులో కళ్యాణ మందిరం నిర్మించనున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. NTPC వారి సీఎస్ఆర్ నిధులు కింద రూ. 2కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో తాను తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో చిర్రావూరులో సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు.

News December 7, 2025

తిరుపతి: అటు ర్యాగింగ్… ఇటు లైంగిక వేధింపులు

image

ఎస్వీయూలో ఇటీవల ర్యాగింగ్ కలకలం.. తాజాగా NSU లైంగిక వేధింపులతో తిరుపతి విద్యా కేంద్రానికి చెడ్డపేరు వచ్చింది. ఇలాంటి విద్యాలయాల్లో యువతులకు భద్రత ఎంత? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూనివర్సిటీల కమిటీలు, మహిళా పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వర్సిటీల అధికారులు ఏమి చేస్తారో వేచి చూడాలి.