News March 27, 2025

శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలు

image

శ్రీశైలం మల్లన్న ఆలయం ఉగాది ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 31 వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి విశేషార్చనలు, అమ్మవారికి వాహన సేవలు జరగనున్నాయి. 30వ తేదీ ఉదయం విశ్వావసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ఉంటుంది. అదేరోజు సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.

Similar News

News November 19, 2025

న్యూస్ రౌండప్

image

✦ TGలో నేటి నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. మ.12 గంటలకు HYD నెక్లెస్ రోడ్డులో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద చీరల పంపిణీని ప్రారంభించనున్న CM రేవంత్
✦ పార్టీ ఫిరాయింపులపై నేడు, రేపు MLAల విచారణ.. నేడు తెల్లం వెంకట్రావు, సంజయ్, రేపు పోచారం, అరికెపూడి గాంధీకి సంబంధించిన పిటిషన్ల విచారణ
✦ రేపు బిహార్‌కు CM CBN, మంత్రి లోకేశ్.. నితీశ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడంతో పాటు పారిశ్రామికవేత్తలతో భేటీ

News November 19, 2025

వేమనపల్లిలో విషాదం.. అనాథలైన ముగ్గురు చిన్నారులు

image

వేమనపల్లి మండలంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు కుమారులు, ఒక కూతురు అనాథలయ్యారు. ఆరేళ్ల క్రితం కరోనా మహమ్మారి సమయంలో తండ్రిని కోల్పోయిన ముగ్గురు చిన్నారులు.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తల్లిని కోల్పోయారు. వరుసగా జరిగిన ఈ రెండు దుర్ఘటనలు ఆ కుటుంబ భవిష్యత్తును చీకటిలోకి నెట్టేశాయి. ముగ్గురు చిన్నారుల అనాథ స్థితి అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.

News November 19, 2025

నేటి నుంచి ఉమ్మడి వరంగల్‌లో పత్తి కొనుగోలు ప్రారంభం

image

ఉమ్మడి వరంగల్‌లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం కానున్నాయి. సీసీఐ కొనుగోళ్లలో తలెత్తిన సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ట్రేడర్స్ అసోసియేషన్ బంద్ విరమించింది. సచివాలయంలో మంత్రి నాగేశ్వరరావు, అధికారులు, సీసీఐ ప్రతినిధులు, కాటన్ ట్రేడర్స్ అసోసియేషన్‌తో సమావేశమై జిన్నింగ్-ప్రెస్సింగ్ సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ హామీ మేరకు కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.