News March 27, 2025
శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలు

శ్రీశైలం మల్లన్న ఆలయం ఉగాది ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 31 వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి విశేషార్చనలు, అమ్మవారికి వాహన సేవలు జరగనున్నాయి. 30వ తేదీ ఉదయం విశ్వావసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ఉంటుంది. అదేరోజు సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
Similar News
News February 26, 2026
జగిత్యాల: కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్త్

జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.ప్రతి కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్త్, పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడించారు.విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు.పరీక్షలు ముగిసే వరకు పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.
News February 26, 2026
క్షేత్రస్థాయిలో రైతులకు పథకాలు అమలు చేయాలి: కలెక్టర్

పీఎం ధన ధాన్య కృషి యోజన అమలుపై గురువారం కేంద్ర అధికారి సిద్ధార్థ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టర్లో కలెక్టర్తో పాటు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో రైతులకు పథకాలు మరింత చేరువ చేయాలన్నారు. ఆధునిక సాగు పద్ధతులపై దృష్టి సారించాలని, చియా పంటను జిల్లా అంతట విస్తరింపజేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 26, 2026
53 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా: VZM ఎస్పీ

మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ గురువారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని ఎస్పీ వెల్లడించారు.


