News April 12, 2025
శ్రీశైలంలో నేడు గిరి ప్రదక్షిణ కార్యక్రమం

పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో శనివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. స్వామి, అమ్మవారికి మహా మంగళ హారతుల పూజల అనంతరం ఆలయ మహాద్వారం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అందరికీ ప్రదక్షిణ అనంతరం స్వామి, అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు.
Similar News
News February 14, 2026
వేములవాడ: రెండోసారి.. సారీ..!

వేములవాడ నగర పంచాయతీ మాజీ చైర్ పర్సన్ నామాల ఉమకు వరుసగా 2వసారి పరాజయం తప్పలేదు. 2020 ఎన్నికలలో 26వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆమె.. ఈసారి ఎన్నికలలో 23వ వార్డు కాంగ్రెస్ తరపున బరిలోకి దిగినా ఫలితం దక్కలేదు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకున్నప్పటికీ, తాము బలపరిచిన బోనాల సాగరిక బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో ఆమె పైనే పోటీ చేసి ఓటమి చవిచూడాల్సి రావడం గమనార్హం.
News February 14, 2026
2026-27 బడ్జెట్: వ్యవసాయం, నీరు పారుదలకు కేటాయింపులు

AP: అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.6,600 కోట్లను కేటాయించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.1,927 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు, పంటల బీమాకు రూ.250 కోట్లు, PM కృషి సించాయీ యోజనకు రూ.190 కోట్లు, మత్స్యకార సేవలో కోసం రూ.260 కోట్లు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.9,906 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.6,105 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
News February 14, 2026
అప్పు తీర్చడానికి మళ్లీ అప్పు: పయ్యావుల

AP: పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వంలో రాష్ట్రం ₹9.74లక్షల కోట్ల అప్పుతో ఆర్థికంగా విధ్వంసమైంది. మేము చేస్తున్న అప్పు ఉత్పాదకతకు ఖర్చు చేస్తున్నాం. ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా బయటపడలేదు. పరిస్థితులు సానుకూలంగా లేవు. అనేక సవాళ్లు ఉన్నా అభివృద్ధి సంక్షేమంపై మా లక్ష్యాల్లో మార్పు లేదు’ అని వివరించారు.


