News April 13, 2025
శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు స్థానిక పాతాళ గంగలో స్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. సాధారణ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచి రద్దీ పెరిగింది.
Similar News
News November 21, 2025
ఆముదంతో ఎన్నో లాభాలు

చాలామంది ఇళ్లల్లో లభించే ఆముదం నూనెలో ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటి ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఇది వాడటం వల్ల జుట్టుకు అవసరమైన పూర్తి పోషణ అందుతుంది. జుట్టు రాలడం, చిట్లి పోవడం తగ్గి, కుదుళ్లు బలపడతాయి. ఎక్కువ జిడ్డుగా ఉంటుందని చాలామంది దీన్ని వాడటం మానేస్తారు. కానీ జుట్టు పెరగాలని కోరుకునేవారు ఆముదం నూనె ఎంచుకోవచ్చు.
News November 21, 2025
NGKL: ఐకాన్ బ్రిడ్జి నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన ఎంపీ ఈటల

కొల్లాపూర్ సోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐకాన్ తీగల వంతెన నిర్మాణ స్థలాన్ని ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. రెండు రాష్ట్రాలను కలిపే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం రూ.1083 కోట్లతో చేపట్టింది. ఈ వంతెన పర్యాటక అభివృద్ధికి దోహదపడనుంది. ఈటల, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, BJP ఇన్చార్జితో కలిసి లాంచీలో నిర్మాణ స్థలాన్ని సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
News November 21, 2025
బ్రాహ్మణపల్లిలో నూతన విత్తన బిల్లు-2025పై చర్చా గోష్ఠి

PDPL జిల్లా బ్రాహ్మణపల్లి రైతు వేదికలో TG రైతు విజ్ఞాన కేంద్రం, KNR ఆధ్వర్యంలో నూతన విత్తన బిల్లు 2025 ముసాయిదాపై చర్చా గోష్ఠి జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరాకు బిల్లు ఎంత కీలకమో వివరించారు. డా. రాజేంద్ర ప్రసాద్ బిల్లుపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ అందించారు. శాస్త్రవేత్తలు, విత్తన ధ్రువీకరణ సంస్థ ప్రతినిధులు, సీడ్స్మెన్ సభ్యులు, రైతు సంఘాలు పాల్గొన్నారు.


