News March 27, 2025
శ్రీశైలంలో భారీ పోలీస్ బందోబస్తు: ఎస్పీ

శ్రీశైలంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, అడిషనల్ డీజీపీ మధుసూదన్ రెడ్డి, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలతో పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సిబ్బంది అందరూ అంకితభావంతో పని చేయాలన్నారు.
Similar News
News February 24, 2026
ఖమ్మం చెంతకు ‘కలియుగ వైకుంఠం’..!

ఖమ్మం ధంసలాపురంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఆలయంతో పాటు వసతి గృహాలు, కళ్యాణ మండపాలు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని, త్వరలోనే నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని తుమ్మల వెల్లడించారు.
News February 24, 2026
కాసేపట్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2-3 గంటల్లో గద్వాల్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా రాత్రంతా హైదరాబాద్లో <<19222449>>భారీ వర్షం<<>> కురిసిన విషయం తెలిసిందే.
News February 24, 2026
నేడు నాగర్కర్నూల్లో టెన్షన్.. టెన్షన్..!

కుమ్మెర ఘటన నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే BRS, CPM, BSP, TRP, తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ, MRPS, బీసీ సంఘాల నేతలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. అయితే 8 మంది నిందితుల్లో ముగ్గురినే పోలీసులు అరెస్ట్ చేశారని వారంటున్నారు. కాగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నిన్న కాంగ్రెస్ జిల్లా చీఫ్, MLA వంశీకృష్ణ తెలిపారు. నేడు BJP స్టేట్ చీఫ్ రాంచందర్రావు NGKLకు రానుండగా టెన్షన్ నెలకొంది.


