News February 8, 2025
శ్రీశైలంలో మద్యం తాగుతూ పట్టుబడిన వైసీపీ నేత!

శ్రీశైలం దేవస్థానం పరిధిలో వైసీపీ నేత మద్యం తాగుతూ పట్టుబడ్డారు. దేవస్థానం నిబంధనలు అతిక్రమించి ఆలయ ఉద్యోగితో కలిసి రజాక్ అనే వ్యక్తి మద్యం తాగుతున్నారు. రాత్రి పోలీసులు దాడులు నిర్వహించగా రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవదాయ చట్టం ఉల్లంఘన మేరకు వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం. రజాక్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా తెలుస్తోంది.
Similar News
News November 28, 2025
సర్పంచ్ నుంచి MLAగా.. రాణించిన జిల్లా నేతలు..!

గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించిన పలువురు నేతలు MLAలుగా రాణించారు. వేములవాడ మండలం రుద్రవరం గ్రామ సర్పంచ్గా పేరు తెచ్చుకున్న రేగులపాటి పాపారావు సిరిసిల్ల ఎమ్మెల్యేగా, గంభీరావుపేట వార్డు సభ్యుడిగా పనిచేసిన కటకం మృత్యుంజయం కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగిత్యాల జిల్లా అంతర్గాం సర్పంచ్గా పనిచేసిన సుద్దాల దేవయ్య నేరెళ్ల ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి మంత్రిగా సేవలందించారు.
News November 28, 2025
తిరుపతి: కల్తీ నెయ్యి కేసులో మరిన్ని అరెస్టులు..?

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 15వ తేదీలోపు మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ తప్పించుకుని తిరుగుతున్న కరీముల్లను సైతం 15వ తేదీలోపు అదుపులోకి తీసుకునే దిశగా సిట్ బృందాలు గాలింపు చేపట్టాయి.
News November 28, 2025
స్మృతితో పెళ్లిపై పలాశ్ తల్లి ఏమన్నారంటే..

స్మృతి మంధాన వివాహంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పలాశ్ ముచ్చల్ తల్లి అమృత స్పందించారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆ రోజు జరిగిన పరిణామాలపై ఇద్దరూ బాధపడుతున్నారు. మ్యారేజ్ అవగానే స్మృతికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేశాం. అనుకోని పరిస్థితులతో వివాహం వాయిదా వేశాం’ అని చెప్పారు. కాగా పెళ్లి సంబంధిత పోస్టులను స్మృతి డిలీట్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.


