News April 14, 2025

శ్రీశైలంలో రద్దీ.. ఆ దర్శనాలు రద్దు

image

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రెండు రోజులుగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో సోమవారం అర్జిత సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులు సహకరించాలని కోరారు.

Similar News

News October 14, 2025

అందరి ఆమోదంతో డీసీసీ ఎన్నిక: సూరజ్ సింగ్ ఠాగూర్

image

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పరిగిలోని వాసవి బంక్యూట్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ జిల్లాస్థాయి సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో AICC ఇన్‌ఛార్జ్ సూరజ్ సింగ్ ఠాగూర్ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ పకడ్బందీగా చేపడతామని తెలిపారు.

News October 14, 2025

పీఎం కిసాన్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించండి: జేసీ

image

వీఆర్‌ఓ, ఎమ్మార్వో లాగిన్లలో పెండింగ్‌లో ఉన్న పీఎం కిసాన్ దరఖాస్తుల్లోని అవాంతరాలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. అర్హులైన రైతులకు, ఆర్ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న రైతులకు గ్రామ సచివాలయాల ద్వారా, బ్యాంకుల సహకారంతో రుణాలు మంజూరు చేయించాలని అధికారులకు సూచించారు.

News October 14, 2025

బాధించేవే మెదడులో భారంగా ఉండిపోతాయి..!

image

ప్రేమతో పలకరించిన మాటల కంటే, బాధించిన విమర్శలనే మనిషి మెదడు ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. దీనికి ‘సర్వైవల్ క్యూ మెకానిజం’ కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతికూల భావోద్వేగాలు మెదడులో బలమైన నాడీ ప్రతిస్పందనలను యాక్టివేట్ చేయడం వల్ల 2 దశాబ్దాలు దాటినా గుర్తుంచుకుంటామని తెలిపారు. ప్రశంసలు సురక్షిత సంకేతాలు కాబట్టి అవి నెల రోజుల్లోనే మసకబారిపోతాయని వెల్లడించారు. మీకూ ఇలానే జరిగిందా?