News April 14, 2025
శ్రీశైలంలో రద్దీ.. ఆ దర్శనాలు రద్దు

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రెండు రోజులుగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో సోమవారం అర్జిత సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులు సహకరించాలని కోరారు.
Similar News
News September 14, 2025
కరీంనగర్లో మినీ ‘సరస్ ఫెయిర్’

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణం అంబేడ్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ నెల 18 వరకు మిని సరస్ ఫెయిర్ 2025 నిర్వహిస్తుట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన చేనేత హస్త కళల, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు.
News September 14, 2025
కొడుకును చంపి నదిలో పడేశాడు!

TG: హైదరాబాద్ బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు అనాస్(3)ను తండ్రి అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీ నదిలో పడేశాడు. అనంతరం బాలుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.
News September 14, 2025
HYD: కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్ట్

ప్లాట్ల అమ్మకం ముసుగులో చీటింగ్ చేసి పరారీలో ఉన్న కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీని LBనగర్ SOT బృందం, LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రదేశాల్లో ప్లాట్లను అమ్మే ముసుగులో భారీగా డబ్బు కాజేసి చాలా మందిని మోసం చేసిన ఆదిభట్లకు చెందిన శ్రీకాంత్(35)ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతడిపై సరూర్నగర్, వనస్థలిపురం, మేడిపల్లిలో కేసులు ఉన్నాయని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.