News April 14, 2025
శ్రీశైలంలో రద్దీ.. ఆ దర్శనాలు రద్దు

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రెండు రోజులుగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో సోమవారం అర్జిత సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులు సహకరించాలని కోరారు.
Similar News
News November 16, 2025
రాష్ట్రపతి నిలయంలో వేడుకలు.. ఉచితంగా పాసులు

ఈనెల 21 నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో కనువిందు చేయనున్నారు. 10 రోజుల పాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. వీటిని చూడాలనుకున్న వారికి రాష్ట్రపతి నిలయం ఉచితంగా పాసులు అందజేస్తోంది. ఆసక్తిగల వారు ఆన్లైన్లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.
LINK: https://visit.rashtrapatibhavan.gov.in/plan-visit/rashtrapati-nilayam-hyderabad/p2/p2
News November 16, 2025
HYD: గోల్డెన్ అవర్ మిస్ అయితే గండమే!

ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను గోల్డెన్ హవర్ అని అంటాం. ప్రమాదం జరిగిన గంటలోపు క్షతగాత్రుడికి వైద్యం అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశం 90శాతానికిపైగా ఉంటుందని HYD డా.రవి ప్రకాష్ తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ జరిగిన సమయంలో తొలి 4 గంటలలోపు గోల్డెన్ అవర్గా భావిస్తారు. అయితే తొలి గంటలో వైద్యం 30% మందికి అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. SAVE THE LIFE
News November 16, 2025
HYD: ORR, హైవేలపైనే అధిక యాక్సిడెంట్స్!

గ్రేటర్ HYD అవుటర్ రింగ్ రోడ్డు (ORR), దాని చుట్టూ ఉన్న జాతీయ రహదారులపై ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 52% ప్రమాద కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అధికవేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాత్రి వేళల్లో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వంటి కారణాలు ప్రధానంగా గుర్తించారు.


