News April 14, 2025

శ్రీశైలంలో రద్దీ.. ఆ దర్శనాలు రద్దు

image

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రెండు రోజులుగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో సోమవారం అర్జిత సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులు సహకరించాలని కోరారు.

Similar News

News November 17, 2025

కాశీ నుంచి గంగాజలాన్ని ఇంటికి తీసుకురావొచ్చా?

image

కాశీని మనం మోక్ష నగరంగా పరిగణిస్తాం. ఇక్కడ ఉండే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లలో నిత్యం దహన సంస్కారాలు జరుగుతుంటాయి. అక్కడ మోక్షం పొందిన ఆత్మల శక్తి గంగాజలంలో ఉంటుందని పండితులు అంటారు. ఆ శక్తిని ఇంటికి తీసుకురావడం అశుభంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొచ్చి, ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని నమ్మకం. అయితే హరిద్వార్, రిషికేశ్ వంటి ఇతర పవిత్ర నగరాల నుంచి గంగాజలం తేవడం శ్రేయస్కరం.

News November 17, 2025

శాలిగౌరారం: Way2News ఎఫెక్ట్.. ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం

image

శాలిగౌరారం(M) ఆకారం గ్రామంలో ఉన్న అతి పురాతనమైన సూర్య దేవాలయం జీర్ణోద్ధరణకు ఇక్కడి యువత నడుం బిగించింది. ఇటీవల Way2Newsలో ‘నాడు ఘన చరిత్ర.. నేడు శిథిలావస్థ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఆకారం, పెర్కకొండారం గ్రామానికి చెందిన 400 మంది యువకులు, యువజన సంఘాలు శ్రమదానం చేసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ ఆలయ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

News November 17, 2025

కోదాడ: ‘ప్రతి రంగంలోనూ మహిళల అద్భుత ప్రతిభ’

image

మానవ వికాసంలో మహిళల శ్రమ పెద్ద విప్లవం అని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు డి. స్వరూప అన్నారు. కోదాడలో ఆదివారం నిర్వహించిన సూర్యాపేట జిల్లా రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆమె మాట్లాడారు. గణ సమాజం నుంచి నేటి అంతరిక్ష పరిశోధనల వరకు ప్రతి రంగంలోనూ స్త్రీలు అద్భుత ప్రతిభ చూపారని కొనియాడారు. అయితే సమాజం మారుతున్న క్రమంలో స్త్రీని అణగదొక్కారని విమర్శించారు.