News February 18, 2025

శ్రీశైలంలో విద్యుత్ కాంతులు

image

మల్లన్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలం వీధులు విద్యుత్ దీప కాంతుల్లో వెలుగొందుతున్నాయి. మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలతో శ్రీశైలంలోని వీధులను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడవీధుల్లో వివిధ ఆకృతుల్లో ఏర్పాటుచేసిన డెకరేషన్ లైట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ దీపాలతో శ్రీశైలం కొత్త శోభను సంతరించుకుంది.

Similar News

News April 18, 2026

KNR: మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు

image

జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్ తెలిపారు. ఆస్ట్రేలియా, ఓమన్, జర్మనీ, గ్రీసీ, ఖతార్ తదితర దేశాల్లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయని, ఐటీఐ, డిగ్రీ, పీజీ, డిప్లోమా, నర్సింగ్ కోర్సులు చదివి 21 నుంచి 58 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9440051285, 9440051452 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News April 18, 2026

పోలీసులకు వారాంతపు సెలవులపై చర్యలు తీసుకోవాలి: ADB SP

image

పోలీసులకు వారాంతపు సెలవులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎండాకాలం దృష్ట్యా సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తాగడం, ఎండలో బయటకు వెళ్లే సందర్భంలో రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. త్వరలోనే సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్రమాలపై సమాచారం అందించిన సిబ్బందికి ప్రోత్సహిస్తామన్నారు.

News April 18, 2026

MNCL: 20 నుంచి ఓపెన్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పదవ తరగతిలో 654 మంది, ఇంటర్‌లో 1226 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.