News April 11, 2025
శ్రీశైలం: అంగన్వాడీ సెంటర్లపై ఫుడ్ కమిషన్ చర్యలు చేపట్టేనా..?

శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు పరిధిలోని అంగన్వాడీ సెంటర్లపై ఫుడ్ కమిషన్ ఛైర్మన్ చర్యలు చేపడతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సంవత్సరం క్రితం నుంచి అంగన్వాడీ కేంద్రాలపై పలువురు ఫుడ్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మండల పరిధిలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ చిత్త ప్రతాపరెడ్డి తనిఖీలు చేపట్టారు. ఆయన పర్యటన నేపథ్యంలో అక్రమాలకు పాలుపడుతున్న సెంటర్లపై చర్యలు చేపట్టవలసిన అవసరం నెలకొంది.
Similar News
News October 23, 2025
ADB: మంట గలుస్తున్న మానవ సంబంధాలు

కుటుంబాలు ప్రేమ, ఆప్యాయతకు నిలువెత్తు ప్రతిరూపాలు. కానీ ఆ బంధాలు కాస్త కన్నీటి గాథలవుతున్నాయి. మంచిర్యాలలో పండుగపూటే భార్యను భర్త చంపుకోగా, జన్నారంలో మరోచోట కన్న కొడుకే తండ్రిని హతమార్చడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వివాహంపై మామ పెంచుకున్న కక్ష దహెగాంలో కోడలి ప్రాణం తీసింది. పవిత్రమైన అనుబంధాల్లో విషం నింపుతున్న ఈ ఘటనలు, నేటి సమాజంలో క్షీణిస్తున్న మానవ సంబంధాల విలువలకు అద్దం పడుతున్నాయి.
News October 23, 2025
అక్టోబర్ 23: చరిత్రలో ఈరోజు

1922: రచయిత అనిశెట్టి సుబ్బారావు జననం
1923: మాజీ ఉపరాష్ట్రపతి బైరాన్సింగ్ షెకావత్ జననం
1979: సినీ హీరో ప్రభాస్ జననం
1991: హీరోయిన్ చాందిని చౌదరి జననం
2007: ప్రముఖ తెలుగు కవి ఉత్పల సత్యనారాయణాచార్య మరణం
2023: భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి మరణం
News October 23, 2025
సంగారెడ్డి: ప్రవేశాలకు నేడే చివరి గడువు: డీఈఓ

ఉమ్మడి జిల్లాలోనీ వర్గల్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతులలో ప్రవేశం పొందేందుకు గడువు నేటి వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు https://www.navodaya.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.