News March 2, 2025
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు రానున్న సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర పరిధిలోని శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణంలో భాగంగా 8 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో వారిని వెలికి తీసేందుకు ఎనిమిది రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్ వద్దకు రానున్నారు. ఈయన పర్యటనకు సంబంధించి ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Similar News
News October 31, 2025
నేడు వరంగల్కు సీఎం..!

వరంగల్ నగరంలో వరద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం రానున్నారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా సీఎం ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం హనుమకొండ కలెక్టరేట్లలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం సీఎం పర్యటన ఉంటుందని అధికారులు తెలిపారు.
News October 31, 2025
నేడు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

AP: పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA అంచనా వేసింది. కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. అటు ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా, కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 31, 2025
సిద్దిపేట: తుపాకీతో బెదిరించిన నిందితుల అరెస్ట్

అక్బర్పేట మం. రుద్రారంలో ఈనెల 28న RMP డాక్టర్ ఆర్ఎంపీ లక్ష్మీ నరసయ్య ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను తుపాకీతో బెదిరించిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి వివరించారు. బిక్షపతి, బ్రహ్మం, నర్సింలు@ కమలాకర్, ఆర్ఎంపీ నరేందర్ రెడ్డిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. తేలికగా డబ్బు సంపాధించాలనే ఆశతో వీరంతా గ్యాంగ్గా ఏర్పడి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తేల్చారు.


