News August 4, 2024

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

image

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెం చెందిన వంశీకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి శ్రీశైలం వెళ్లి వస్తుండగా.. మార్గమధ్యంలో బోడే నాయక్ తండ వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి రక్షణ గోడను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 25, 2025

నేపాల్‌లో 8 మంది పామూరు యువకులు అరెస్టు

image

బెట్టింగుల కోసం దేశాలు దాటి పామూరు యువకులు జైలు పాలైన సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. నేపాల్ దేశంలో జరుగుతున్న ఎన్పీఎల్ క్రికెట్‌పై ఆన్‌లైన్‌లో బెట్టింగ్ కాసేందుకు పామూరుకు చెందిన 8 యువకులు బెంగుళూరు నుంచి విమానం ద్వారా నేపాల్‌కి చేరుకున్నట్లు సమాచారం. నేపాల్‌కి వెళ్లెందుకు పాస్‌పోర్ట్ అవసరం లేకపోవడంతో ఆధార్ కార్డుపై నేపాల్ వెళ్లారు. పోలీసుల పక్కా సమాచారంతో 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News November 25, 2025

ప్రకాశం: సందేహాలు ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి.!

image

పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈఓ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పదవతరగతి ఫీజు చెల్లింపులు, నామినల్ రోల్స్ సమయంలో ఇబ్బందులు ఉన్నయెడల వాటి పరిష్కారానికి స్పెషల్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 9848527224, 8985601722కు సంప్రదించాలన్నారు.

News November 25, 2025

ప్రకాశం: సందేహాలు ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి.!

image

పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈఓ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పదవతరగతి ఫీజు చెల్లింపులు, నామినల్ రోల్స్ సమయంలో ఇబ్బందులు ఉన్నయెడల వాటి పరిష్కారానికి స్పెషల్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 9848527224, 8985601722కు సంప్రదించాలన్నారు.