News August 27, 2024
శ్రీశైలం జలాశయానికి 2 లక్షల వరద నీటి ప్రవాహం

కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైల జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా 2,08,001 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో డ్యామ్ నీటిమట్టం 884.30 అడుగులుగా, నిల్వ సామర్థ్యం 211.4759 టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 68,744 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
Similar News
News October 23, 2025
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించండి: కలెక్టర్

కర్నూలు నగర ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించాలని సంబంధింత అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. గురువారం సాయంత్రం కర్నూలు నగర శివారులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. ట్యాంక్ స్థితి, నీటి నిల్వను సమీక్షించారు. సమ్మర్ సిద్ధతలను దృఢంగా క్రమబద్ధం చేయాలని ఆదేశించారు. తక్షణ మరమ్మతులు, రక్షణ చర్యలపై అధికారులు దృష్టి పెట్టేలా సూచించారు. తాగునీటి సరఫరా సురక్షితం చేయడం ప్రధాన లక్ష్యమన్నారు.
News October 23, 2025
రైతులకు భూమాత రక్షణ, మిశ్రమ పంటలపై అవగాహన కల్పించండి: కలెక్టర్

భూమాత రక్షణ కార్యక్రమం ద్వారా రైతులకు మిశ్రమ పంటల సాగు, ఎరువుల సమర్థ వినియోగంపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎక్కువ రసాయన ఎరువులు ఉపయోగిస్తున్న 100 గ్రామపంచాయతీలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సబ్ డివిజనల్, గ్రామస్థాయిల్లో భూమాత రక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
News October 23, 2025
వలసబాట పట్టిన కూలీలు

గ్రామాల్లో ఉపాధి కరువై పొట్ట కూటి కోసం కూలీలు వలసబాట పట్టారు. బుధవారం పెద్దకడబూరు ఎస్సీ కాలనీకి చెందిన పలువురు కూలీలు కర్ణాటకలోని రాయచూరు జిల్లా గబ్బూరు మండలం హనుమాపురంలో పత్తి తీయడానికి టెంపోలో బయలుదేరారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గ్రామంలో సాగు చేసిన పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో పనులు కరువయ్యాయి. దీంతో చేసేది లేక పిల్లా పాపలతో కూలీలు వలస బాట పట్టారు.