News August 27, 2024
శ్రీశైలం జలాశయానికి 2 లక్షల వరద నీటి ప్రవాహం

కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైల జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా 2,08,001 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో డ్యామ్ నీటిమట్టం 884.30 అడుగులుగా, నిల్వ సామర్థ్యం 211.4759 టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 68,744 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
Similar News
News February 12, 2025
‘ఎల్ఐసీ ఉద్యోగులకు పనిభారం తగ్గించండి’

LICలో 3, 4 తరగతుల శ్రేణిలో ఖాళీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పీఎస్ రవిబాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఆదోని బ్రాంచ్ కార్యాలయం ముందు సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. LICలో కేవలం ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలల్లోనే 3,130 మంది క్లాస్ 3, 4 తరగతుల శ్రేణి ఉద్యోగులు తగ్గారని అన్నారు. పాలసీదారులకు సేవలందించేందుకు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారన్నారు.
News February 11, 2025
కోరికల కొండ గురించి తెలుసా?

శ్రీశైలం పాదయాత్రలో పెద్ద చెరువు దాటిన తర్వాత కోరికల కొండ వస్తుంది. ఈ కొండ మీద మన కోరిక చెప్పుకుంటే తీరుతుందని భక్తుల నమ్మకం. పెళ్లి కావాలనుకునే వారు అక్కడ చిన్న పందిరి వేస్తారట. సంతానం కోరుకొనే వారు ఉయ్యాల కడతారు. సొంతిల్లు కావాలనుకునే వారు ఒక రాయి మీద ఇంకో రాయి పేరుస్తారు. కొంత మంది తమ కోరికలు ఆ కొండ మీద మట్టిలో చేతితో రాస్తారట. మరి మీరు శ్రీశైలానికి పాదయత్రగా వెళ్లారా?
News February 11, 2025
నేడు అహోబిలం రానున్న హీరో సాయిదుర్గ తేజ్

ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆలయ దర్శనార్థం మంగళవారం ఉదయం 10 గంటలకు హీరో సాయిదుర్గ తేజ్ వస్తున్నట్లు జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య తెలిపారు. ఆళ్లగడ్డ ప్రాంతంలోని అభిమానులు అహోబిలం క్షేత్రానికి వచ్చి ఆయన పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.