News May 18, 2024

శ్రీశైలం ప్రాజెక్టులో కుక్కను చంపిన చిరుత

image

శ్రీశైలం వెస్టర్న్ కాలనీలోని నల్లబోతుల మల్లికార్జున ఇంటి ఆవరణలో కట్టేసిన కుక్కను చిరుత పులి చంపిన ఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. రాత్రి రెండు గంటల సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని ఆ సమయంలో బయటకు రాకుండా ఉదయం చూస్తే కుక్క చనిపోయి ఉందన్నారు. అటవీశాఖ సిబ్బంది వచ్చి పరిశీలించి చిరుతపులి దాడి చేసినట్లు పేర్కొన్నట్లు తెలిపారు.

Similar News

News December 7, 2025

నంద్యాల: పెళ్లి అయిన నెలకే యువకుడి సూసైడ్

image

అనంత(D) యాడికి మండలం నగరూరుకు చెందిన శరత్‌కుమార్‌(25) కొలిమిగుండ్ల జగనన్న కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి తన మిత్రుడు హరీశ్ ఇంటికి వచ్చిన శరత్.. శనివారం హరీశ్ డ్యూటీకి వెళ్లిన తర్వాత విషగుళికలు మింగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని అనంతపురం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. శరత్ గత నెలలో బళ్లారిలో వివాహం చేసుకుని, బెంగళూరులో ప్రైవేట్ జాబ్‌లో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 7, 2025

కర్నూలు: ‘స్క్రబ్ టైఫస్.. వ్యాధి కాదు’

image

స్క్రబ్ టైఫస్ వ్యాధి కాదని, మనిషి నుంచి మనిషికి వ్యాపించదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై వైద్య బృందంతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 44 పాజిటివ్ కేసులు వచ్చాయని, అందరికీ చికిత్స అందించామని, 39 మంది రోగులను డిశ్చార్జ్ చేశామని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు వివరించారు.

News December 7, 2025

ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది: డీఈవో

image

పదో తరగతి ఫలితాల కోసం ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించి, పాఠాలు పూర్తిగా నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. ప్రతీ పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.