News February 11, 2025
శ్రీశైలం: మంత్రుల సమావేశంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

శ్రీశైలం దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై ఏర్పాటు చేసిన మంత్రుల సమీక్షా సమావేశంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఈ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, ఎస్పీకి సూచించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈవో, సిబ్బందిని మంత్రి బీసీ ఆదేశించారు.
Similar News
News December 5, 2025
MBNR: విద్యార్థికి వేధింపులు.. ఇద్దరు సస్పెండ్

జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థిని వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్ రజిని రాగమాల, వైస్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మిని సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థిని వేధింపులకు పాల్పడిన సంఘటన ఉమ్మడి జిల్లాలో గురువారం సంచలనంగా మారింది. DSP వెంకటేశ్వర్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News December 5, 2025
వరంగల్: ఖర్చులు చూసుకుంటాం.. వచ్చి ఓటెయ్యండి..!

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఓరుగల్లు అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఉదయం 6 నుంచే గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఉపాధి కోసం వివిధ పట్టణాలకు వెళ్లిన వారికి ఫోన్లు చేసి రానుపోను ఛార్జీలతో పాటు ఖర్చులు పెట్టుకుంటామని, వచ్చి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఒక్కో ఓటు కీలకం కావడంతో ఎవరినీ వదలకుండా ఓటర్లందరినీ కవర్ చేస్తున్నారు.
News December 5, 2025
వామ్మో.. ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.40వేలు

వందల సంఖ్యలో ఇండిగో ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో దేశీయ విమాన టికెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఢిల్లీ టు లండన్ టికెట్ ధర రూ.25వేలు ఉంటే ఢిల్లీ టు కొచ్చి టికెట్ ఫేర్ ఏకంగా రూ.40వేలకు పెంచేశారు. ఇది సాధారణంగా రూ.5,000-రూ.10,000 మధ్య ఉంటుంది. ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.40,452కు ఎగబాకింది. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రేట్లు పెంచవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


