News February 24, 2025
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన గవర్నర్

శ్రీశైలం మల్లన్న దర్శనార్థమై రాష్ట్ర గవర్నర్ శ్రీశైలం చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ వద్ద మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఫారుక్, బీసీ జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
Similar News
News December 5, 2025
పాక్ తొలి CDFగా ఆసిమ్ మునీర్ నియామకం

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్గా ఉన్న ఆసిమ్ మునీర్ను ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవితో పాటు CDFగానూ ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పింది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. వీరిద్దరికి అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుభాకాంక్షలు తెలిపినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
News December 5, 2025
అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ 8కి వాయిదా

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కల్తీకి ఉపయోగించిన కెమికల్స్లను సరఫరా చేసిన ఏ19 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అతనికి బెయిల్ ఇస్తే దర్యాప్తు సరిగ్గా సాగదని ప్రాసిక్యూటర్ వాదించారు. దీంతో బెయిల్ పిటిషన్ 8వ తేదీకి నెల్లూరు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
News December 5, 2025
RR: ఉమెన్స్ షూటింగ్ బాల్ ఎంపికలు రేపే

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహిళలు, బాలికల కోసం రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా ఉమెన్స్ ఓపెన్ టు ఆల్ షూటింగ్ బాల్ ఎంపికలను నిర్వహించనున్నారు. ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు తాండూరు పట్టణంలోని సెంట్ మార్క్స్ స్కూల్లో ఎంపికలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారిణులు తమ బోనఫైడ్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని కోరారు.


