News July 16, 2024
శ్రీశైలం రిజర్వాయర్లో గాలిస్తున్నాం: నంద్యాల ఎస్పీ
నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహం ఇంకా దొరకలేదని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ తెలిపారు. ‘బాలికను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేశారు. ఆ తర్వాత హత్య చేశారు. మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్లో పడేశారు. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేశాం. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్లో గాలిస్తున్నాం. మృతదేహం ఇంకా దొరకలేదు’ అని ఎస్పీ తెలిపారు.
Similar News
News October 14, 2024
జ్వరంతో కొడుకు మృతి.. విషాదంలో తల్లి
ఆస్పరికి చెందిన శివ(16) జ్వరంతో మృతిచెందాడు. తల్లి మహేశ్వరి హోటల్ నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. శివకు జ్వరం రావడంతో శనివారం ఆదోనిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. భర్త భీమేష్ 2018లో అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబానికి ఆధారమైన భర్త, కొడుకు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
News October 14, 2024
KNL: నేడే లాటరీ.. తీవ్ర ఉత్కంఠ..!
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొత్తగా నెలకొల్పనున్న (కర్నూలు-99, నంద్యాల-105) మద్యం దుకాణాల నిర్వహణకు ఇవాళ టెండర్లు నిర్వహించనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్నూలుకు సంబంధించి జడ్పీ సమావేశ మందిరంలో, నంద్యాలకు సంబంధించి కలెక్టరేట్ సెంటినరీ హాల్లో లాటరీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల ఎస్పీలు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
News October 14, 2024
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్
భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. ఆదివారం అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా కమాండ్ కంట్రోల్ రూమ్ 08518-277305కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.