News February 20, 2025

శ్రీశైలం వెళ్లే యాత్రికులకు బిగ్ అలర్ట్

image

శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం వెళ్లే భక్తులకు అటవీ అధికారులు కీలక సూచన చేశారు. దోర్నాల, శిఖరం చెక్ పోస్ట్‌ల వద్ద ఈ నెల 24 నుంచి 28 వరకు వాహనాలకు 24 గంటల అనుమతి ఉందని రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. తెలంగాణ పరిధిలోని మన్ననూరు, దోమలపెంట వద్ద 23 నుంచి మార్చి 1 వరకు కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే 24 గంటలు అనుమతిస్తామని రేంజర్స్ రవికుమార్, గురు ప్రసాద్ వెల్లడించారు.

Similar News

News February 26, 2026

పెద్దపల్లి: 74 మంది విద్యార్థుల గైర్హాజరు

image

జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు/ఉర్దూ/ హిందీ /సంస్కృతం పరీక్షకు 98% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తెలిపారు. 4815 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 4731 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 74 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. మొత్తం మీద పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

News February 26, 2026

MHBD: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు MHBD జిల్లా క్రీడల అధికారి జ్యోతి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 26 నుంచి మార్చి 4వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మండల స్థాయి ఎంపికలు మార్చి 13 నుంచి 17 వరకు ఎంఈఓల పర్యవేక్షణలో జరుగుతాయని, అక్కడ ప్రతిభ చాటిన వారికి మార్చి 28న జిల్లా కేంద్రంలోని NTR స్టేడియంలో తుది ఎంపికలు నిర్వహిస్తామన్నారు.

News February 26, 2026

పదేళ్లలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వలేదు: CM రేవంత్

image

TG: గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక TGPSCని ప్రక్షాళన చేశామన్నారు. ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠిన చర్యలు చేపట్టామని గ్రూప్-1,2 ఆఫీసర్ల ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారంతా ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయాలని సూచించారు.