News February 20, 2025

శ్రీశైలం వెళ్లే యాత్రికులకు బిగ్ అలర్ట్

image

శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం వెళ్లే భక్తులకు అటవీ అధికారులు కీలక సూచన చేశారు. దోర్నాల, శిఖరం చెక్ పోస్ట్‌ల వద్ద ఈ నెల 24 నుంచి 28 వరకు వాహనాలకు 24 గంటల అనుమతి ఉందని రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. తెలంగాణ పరిధిలోని మన్ననూరు, దోమలపెంట వద్ద 23 నుంచి మార్చి 1 వరకు కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే 24 గంటలు అనుమతిస్తామని రేంజర్స్ రవికుమార్, గురు ప్రసాద్ వెల్లడించారు.

Similar News

News November 21, 2025

HYD: దొంగ నల్లా కనెక్షన్‌పై ఫిర్యాదు చేయండి

image

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నల్లా అక్రమ కనెక్షన్లపై అధికారుల రైడ్ కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో దాదాపుగా 50 మందికిపైగా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకున్న వారు, కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే 99899 98100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

News November 21, 2025

ఖమ్మం: అనుమానంతో భార్యను కడతేర్చిన వైనం

image

ఖమ్మం గట్టయ్య సెంటర్‌లో తన భార్య సాయి వాణి(33)ని భర్త గోగుల భాస్కర్ కత్తితో గొంతు కోసి చంపడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే కొన్నేళ్లుగా అనుమానంతో వేధిస్తున్న భాస్కర్‌కు గతంలో పోలీస్ స్టేషన్లలో కౌన్సెలింగ్‌ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఏడాదిగా విడిగా ఉంటున్న భార్యను మాటువేసి హతమార్చాడు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిది APలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట.

News November 21, 2025

కడపలో నేడు వాహనాల వేలం

image

కడప జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు వాహనాలు పట్టుబడ్డాయి. ఈక్రమంలో 9 వాహనాలకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నారు. కడపలోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌ ఆవరణలో జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని అధికారులు కోరారు.