News March 30, 2025

శ్రీశైల ఆలయ క్యూలైన్లను పరిశీలించిన నంద్యాల ఎస్పీ

image

ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం పరిశీలించారు. ఆలయ పరిసరాలు, భక్తుల కంపార్ట్మెంట్ లు, క్యూలైన్లు, లడ్డు కౌంటర్ తదితరాలను పరిశీలించారు. విధులలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుకోని ఘటన జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ ప్రసాదరావు ఉన్నారు.

Similar News

News February 23, 2026

సైన్స్ సమగ్ర మహోత్సవం.. ప్రాజెక్టుల అప్‌లోడ్‌కు DEO పిలుపు

image

నేషనల్ సైన్స్ డే పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సైన్స్ సమగ్ర మహోత్సవం’ కోసం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని DEO పి.నాగేశ్వరరావు సూచించారు. ప్రదర్శనలకు సంబంధించిన ఫోటోలు, 3నిమిషాల నిడివి గల వీడియోలను sciencesamagra.in పోర్టల్‌లో సమర్పించాలని కోరారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన ప్రాజెక్టులను ఎంపిక చేసి విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.

News February 23, 2026

కామారెడ్డి జిల్లాలో వాతావరణ వివరాలు..

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో విభిన్న వాతావరణం నెలకొంది. మధ్యాహ్న సమయంలో ప్రజలు ఉక్కపోతకు గురవ్వగా, రాత్రి అక్కడక్కడ వర్షపాతం నమోదయింది. అధికారుల వివరాల ప్రకారం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత బీబీపేట 24.4°C , అత్యల్ప ఉష్ణోగ్రత సర్వాపూర్ 20.6°C లుగా నమోదయ్యాయి. కాగా పిట్లం లో 16మి.మీ, జుక్కల్ 7.8, సోమూర్ 4.8, సర్వాపూర్ 4.5, బిచ్కుంద 3.3, మక్దూంపూర్ 2.8, మేనూరు 2.5మి.మీ వర్షపాతం నమోదయింది.

News February 23, 2026

నాగర్‌కర్నూల్ ఘటన.. NHRCకి ఫిర్యాదు

image

నాగర్‌కర్నూల్ కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా 2నెలల పసికందు మృతిచెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు అందింది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. కులవివక్ష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.