News March 30, 2025

శ్రీశైల ఆలయ క్యూలైన్లను పరిశీలించిన నంద్యాల ఎస్పీ

image

ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం పరిశీలించారు. ఆలయ పరిసరాలు, భక్తుల కంపార్ట్మెంట్ లు, క్యూలైన్లు, లడ్డు కౌంటర్ తదితరాలను పరిశీలించారు. విధులలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుకోని ఘటన జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ ప్రసాదరావు ఉన్నారు.

Similar News

News October 16, 2025

వారంలోగా వాస్తవాలు తెలపండి: కృష్ణా బోర్డు

image

AP: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు DPR తయారీకి జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌పై వారంలో వాస్తవాలు తెలపాలని రాష్ట్రాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. DPR, ప్రాజెక్టు పనులన్నీంటినీ ఆపాలని TG ENC అంజాద్ ఇటీవల CWCకి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించేలా CWCని ఆదేశించాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ రాసినట్లు వివరించారు. ఈ క్రమంలోనే బోర్డు స్పందించి తాజా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

News October 16, 2025

తెనాలి: ఆధిపత్య పోరుతో అన్యాయంగా చంపేశారు..?

image

అమృతలూరు(M) కోరుతాడిపర్రుకు చెందిన జూటూరి తిరుపతిరావు@ బుజ్జి తెనాలిలో మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సంచలనం రేకెత్తించిన హత్య కేసును పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది.గ్రామంలోని రామాలయం విషయంలో ఆధిపత్య పోరుతో సమీప బంధువే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పక్కా ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది

News October 16, 2025

సంగారెడ్డి: ‘ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

image

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నవంబర్ 15 వరకు పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు వివరించారు. గోజాతి, గేదె జాతి పశువుల రైతులు టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.