News February 19, 2025
శ్రీశైల క్షేత్రంలో నేటి పూజ కార్యక్రమాలు ఇవే

శ్రీశైలం క్షేత్రంలో నేటి బుధవారం మంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శ్రీస్వామివారి యాగశాలలో బ్రహ్మోత్సవ క్రతువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 10 గంటల నుంచి పుణ్యాహవాచనం, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, రుద్రకలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, సాయంత్రం సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్ఠాపన, అంకురారోపణ, రుద్రహోమం నిర్వహిస్తారు.
Similar News
News November 25, 2025
రంగారెడ్డి జిల్లా పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

గ్రామపంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా.. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా.. ST జనరల్కు 49, ST మహిళలకు 42, SC జనరల్ 55, SC మహిళలకు 51, BC జనరల్కు 50, మహిళలకు 42, అన్ రిజర్వ్డ్ కేటగిరిలో మహిళలకు 112, పురుషులకు 125 స్థానాలు కేటాయించారు.
News November 25, 2025
GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభం

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్తో పాటు ఆయా పార్టీల MPలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొత్తం 46 అజెండాలపై సమావేశంలో చర్చలు జరపనున్నారు. జూబ్లీహిల్స్ MLA మాగంటి, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, అందెశ్రీ మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.
News November 25, 2025
KCR, KTR.. కాస్ట్లీ భూములు ఆక్రమించారు: ఫోరెన్సిక్ ఆడిట్

సిరిసిల్ల జిల్లాలో ధరణి పోర్టల్పై ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తైంది. జిల్లాలో ధరణి పోర్టల్ దుర్వినియోగంపై ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. KCR, KTR, హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ధరణి పోర్టల్ సాయంతో ఖరీదైన భూములను ఆక్రమించారని ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నాయి. తుది నివేదికను త్వరలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమర్పించనున్నారు.


