News January 10, 2025
శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ
శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయ క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
Similar News
News January 17, 2025
రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్
రోడ్డు భద్రతా మాసోత్సవాలలో వాహన చోదకులను భాగస్వాములు చేసి రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. గురువారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కరపత్రాలు, ఫ్లెక్సీ బ్యానర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాలలో వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు.
News January 16, 2025
నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టండి: మంత్రి టీజీ భరత్
రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టండి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. గురువారం కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా, ఎస్పీతో కలిసి ఆయా శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కోరారు.
News January 16, 2025
బేతంచర్లలో పేడ రంగు తాగి మహిళ ఆత్మహత్య
ఇంటి ముందు కల్లాపు చల్లుకునే పేడ రంగు తాగి మహిళ మృతి చెందిన ఘటన బేతంచెర్ల మండలం పెండేకల్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొట్టాల మహేశ్వరి(22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడ రంగును నీటిలో కలుపుకొని తాగింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న మహేశ్వరిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు బంధువులు వాపోయారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లెకు తరలించి కేసు నమోదు చేశారు.