News January 27, 2025
శ్రీశైల క్షేత్రాభివృద్ధికి మరిన్ని ప్రతిపాదనలు సిద్ధం!

శ్రీశైలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.35కోట్లతో ఏడు మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించాలని, రూ.6.2కోట్లతో తాగునీటి ట్యాంకులు, రూ.99 లక్షలతో అమ్మవారి ఆలయ సాలుమండపం పునర్నిర్మాణం, రూ.86 లక్షలతో పంచమఠాల చుట్టూ కంచ నిర్మాణం, రూ.70లక్షలతో అలంకారం మండపం, రూ.60లక్షలతో ఆగమ పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.
Similar News
News April 16, 2026
పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పించండి: గోయెంకా

పిల్లలకు చిన్నతనం నుంచే పొదుపుపై అవగాహన కల్పించాలని పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సూచించారు. వారి ఆదాయాన్ని (పాకెట్ మనీ) మూడు భాగాలుగా విభజించాలని ఆయన పేర్కొన్నారు. ఒకటి పొదుపు/పెట్టుబడి కోసం, రెండోది వ్యక్తిగత వినోదం కోసం, మూడోది కుటుంబ ఉమ్మడి లక్ష్యాల కోసం ‘హోమ్ ట్యాక్స్’గా కేటాయించాలని తెలిపారు. ఈ విధానం వల్ల పిల్లల్లో బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
News April 15, 2026
అనకాపల్లి: ‘పెండింగ్ చలానాలు ఉంటే వాహనాలు సీజ్’

జిల్లా నేర సమీక్షలో ఎస్పీ తుహిన్ సిన్హా అధికారులకు దిశానిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. పెండింగ్ చలానాలు ఉంటే వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు. రౌడీషీటర్లపై నిఘా ఉంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. దర్యాప్తులో ఈ-సాక్ష్య, యాప్ 360 వంటి టెక్నాలజీ వాడాలని సూచించారు.
News April 15, 2026
మహిళా బిల్లుకే మా మద్దతు.. డీలిమిటేషన్కు లేదు: ఖర్గే

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అయితే డీలిమిటేషన్ బిల్లుకు తాము పూర్తి వ్యతిరేకమని అన్నారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం గారడీలు చేస్తోందని.. జనాభా లెక్కలపై ఎలాంటి క్లారిటీ లేదని పేర్కొన్నారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. ఇండీ కూటమి నేతల సమావేశం అనంతరం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.


