News February 8, 2025
శ్రీశైల జలాశయం నుంచి 6,249 క్యూసెక్కుల నీరు విడుదల

శ్రీశైల జలాశయం బ్యాక్ వాటర్ నుంచి గడిచిన 24 గంటల వ్యవధిలో 6,249 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హెచ్ఎన్ఎస్ఎస్కు 1,560 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆవిరి రూపంలో 272 c/s లాస్ అయింది. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 852 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 84.4800 టీఎంసీలుగా నమోదైంది.
Similar News
News November 21, 2025
ములుగు: ‘వయోవృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి’

వయోవృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. కుటుంబ వ్యవస్థకు వయోవృద్ధులు మూలాధారమని ఆయన అన్నారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం పటిష్ఠమైన చట్టాలు ఉన్నాయని, వారికి ఏవైనా సమస్యలు ఎదురైతే ఆర్డీఓకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
News November 21, 2025
HYD: నాగోల్లో విషాదం.. దంపతుల సూసైడ్

నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో దంపతులు సూసైడ్ చేసుకున్నారు. అప్పుల బాధతో మల్లేశ్, సంతోష పురుగుల మందు తాగారు. అక్కడికక్కడే భార్య మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. శుక్రవారం ఉదయం చైతన్యపురి పీఎస్లో వారి కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
News November 21, 2025
HYD: నాగోల్లో విషాదం.. దంపతుల సూసైడ్

నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో దంపతులు సూసైడ్ చేసుకున్నారు. అప్పుల బాధతో మల్లేశ్, సంతోష పురుగుల మందు తాగారు. అక్కడికక్కడే భార్య మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. శుక్రవారం ఉదయం చైతన్యపురి పీఎస్లో వారి కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


