News November 19, 2024

శ్రీశైల మల్లన్నకు రూ.4.14 కోట్ల హుండీ ఆదాయం

image

శ్రీశైలంలో మంగళవారం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో జరిగిన హుండీల లెక్కింపులో రూ.4,14,15,623ల ఆదాయం సమకూరింది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 18 భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా అందులో ఈ నగదుతో పాటు 322 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారు, 8 కేజీల 520 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా ఇతర దేశాలకు చెందిన కరెన్సీలు కూడా సమకూరాయి. దేవస్థానం అధికారులు హుండీ లెక్కింపును పగడ్బందీగా చేపట్టారు.

Similar News

News March 7, 2026

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV టీకా డ్రైవ్

image

జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే బాలికలకు ‘గార్డాసిల్-4’ టీకా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. జిల్లాలో 19,704 మంది బాలికలను లక్ష్యంగా తీసుకుని ఈ కార్యక్రమం మూడు నెలలు కొనసాగుతుందని వెల్లడించారు.

News March 6, 2026

అక్రమ మైనింగ్‌ను కట్టడి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడంతో పాటు మైనింగ్‌కు సంబంధించిన అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖకు సంబంధించిన అంశాలపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. సహజ వనరులను సంరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు.

News March 6, 2026

ఓపెన్ హౌస్‌లో పోలీసు ఆయుధాల ప్రదర్శన

image

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసు ఆయుధాల ప్రదర్శన ఏర్పాటు చేసి వాటి వినియోగం గురించి వివరించారు. మహిళల భద్రత కోసం అమలు చేస్తున్న శక్తి యాప్, హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ విజయలక్ష్మి, ఆర్‌ఐ జావేద్, ఎస్సైలు, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.