News March 21, 2025

శ్రీసత్యసాయి: పది పరీక్షకు 111 మంది విద్యార్థుల గైర్హాజరు

image

శ్రీసత్యసాయి జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 111 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 104 కేంద్రాలలో శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 104 మంది, ప్రైవేట్ విద్యార్థులు ఏడు మంది గైర్హాజరు అయినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

పెద్దపల్లిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

image

పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ సోమవారం మినీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృత సమీక్ష నిర్వహించారు. నవజాత శిశువుల వారోత్సవాలు, వెసెక్టమీ పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. క్షయ నిర్ధారణ, జ్వరాల సర్వే, డ్రై డే కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఓపీ కేసులు, సిబ్బంది సమయపాలనపై దృష్టి పెట్టి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ఆమె సూచించారు.

News November 17, 2025

పెద్దపల్లిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

image

పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ సోమవారం మినీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృత సమీక్ష నిర్వహించారు. నవజాత శిశువుల వారోత్సవాలు, వెసెక్టమీ పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. క్షయ నిర్ధారణ, జ్వరాల సర్వే, డ్రై డే కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఓపీ కేసులు, సిబ్బంది సమయపాలనపై దృష్టి పెట్టి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ఆమె సూచించారు.

News November 17, 2025

సమస్య పరిష్కారంలో జాప్యం ఉండకూడదు: మహబూబాబాద్ కలెక్టర్

image

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోతోపాటు IDOCలో ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.