News April 5, 2024
శ్రీసత్యసాయి: ప్రొఫెసర్ అనిల్ కుమార్ పాడే మోసిన మాజీమంత్రి
సత్యసాయి బాబా అనువాదకుడు అనిల్ కుమార్ భౌతికకాయాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాళులర్పించారు. రెండు రోజులు క్రితం ప్రొఫెసర్ అనిల్ కుమార్ అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం పుట్టపర్తిలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రొఫెసర్ అనిల్ కుమార్ పాడేను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మోశారు. సత్యసాయిబాబా అనువాదకుడిగా అనిల్ కుమార్ భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
Similar News
News January 18, 2025
JC ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన నటి మాధవీలత
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ JC ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. MAA ట్రెజరర్ శివ బాలాజీకి ఫిర్యాదు పత్రం అందచేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కాగా న్యూ ఇయర్ సందర్భంగా మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జేసీ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
News January 18, 2025
అనంతపురం ఎంపీపై సీఎం ఆగ్రహం!
సీఎం చంద్రబాబు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. పార్టీ సమావేశం కంటే ఇతర పనులే ముఖ్యమా? అని సీఎం మండిపడ్డారు. ఇలాంటి సమావేశాలకు ఎంపీలు రాకపోవడం ఏంటని టీడీపీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలును ప్రశ్నించారు. ఇకపై మారకుంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం.
News January 18, 2025
ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం: కలెక్టర్
నెలలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ అంకితభావంతో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సూచించారు.