News February 3, 2025

శ్రీసత్యసాయి: బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ

image

సోమవారం హిందూపురం మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్ని జరగనున్న నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆదివారం స్థానిక పోలీస్ అధికారులతో కలిసి మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఎన్నిక సమయంలో కార్యాలయంలోకి కౌన్సిలర్లను మాత్రమే అనుమతించాలని, ప్రతి ఒక్కరిని డీఎఫ్ఎండీ ద్వారా చెక్ చేసి పంపించాలని అధికారులను ఆమె ఆదిశించారు.

Similar News

News October 21, 2025

రాజోలి: పిడుగుపాటుకు రైతు మృతి

image

రాజోలి మండలంలోని ముండ్లదిన్నె గ్రామంలో ఉదయం పొలం పనులకు వెళ్లిన కురువ మద్దిలేటి (41) మంగళవారం కురిసిన ఉరుములుతో కూడిన వర్షానికి పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పొలం పనులకని వెళ్లి మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 21, 2025

శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

image

AP: శ్రీశైలంలో రేపటి నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగుతాయని EO తెలిపారు. కార్తీకమాసంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రోజూ విడతల వారీగా మల్లికార్జునస్వామి స్పర్శదర్శనం ఉంటుందని, శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు నిలిపివేస్తామని వెల్లడించారు. హోమాలు, కళ్యాణాలు యథావిధిగా నిర్వహిస్తామన్నారు. అటు పుణ్యక్షేత్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

News October 21, 2025

డేంజర్: మేకప్ బ్రష్‌ను క్లీన్ చేయకపోతే..

image

మేకప్ వేసుకున్న తర్వాత కొందరు మహిళలు బ్రష్‌ను క్లీన్ చేయకుండా వదిలేస్తారు. కొద్ది రోజుల తర్వాత దాన్నే వాడుతుంటారు. ఇది ఎంతో ప్రమాదకరమని, టాయిలెట్ సీటు కంటే శుభ్రపరచని మేకప్ బ్రష్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ బ్రష్‌ను వాడటం వల్ల మొటిమలు, చికాకు వంటి కొత్త సమస్యలొస్తాయని తెలిపింది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మేకప్ బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
#ShareIt