News August 31, 2024
శ్రీసత్యసాయి: సంస్కృతి, వారసత్వంపై రీల్స్ చేస్తే.. లక్ష బహుమతి

శ్రీ సత్య సాయి జిల్లాలోని పర్యాటక ప్రదేశాల సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా వీడియోలు, రీల్స్ చేయాలని జిల్లా పర్యాటకశాఖ అధికారి జయ కుమార్ బాబు తెలిపారు. రీల్స్ చేసిన వారిలో ముగ్గురిని ఎంపిక చేసి వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. ప్రథమ బహుమతి లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి రూ.50,000, తృతీయ బహుమతి రూ.25000 ఇవ్వడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 5 లోగా రీల్స్ పంపాలన్నారు.
Similar News
News September 19, 2025
అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

అనంతపురం: వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో ఆయన సమీక్షించారు. యూరియా పంపిణీ అవసరం ఉన్న చోట తప్పకుండా సరఫరా చేయాలని సూచించారు.
News September 18, 2025
ATP: అధికారులతో కలెక్టర్ సమీక్ష

ప్రభుత్వ అధికారులు పనితీరు మెరుగుపరచుకుని సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లో పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. భారీ పరిశ్రమలకు స్థల సేకరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
News September 18, 2025
ఆలూరు సాంబశివారెడ్డికి కీలక పదవి

అనంతపురం జిల్లా వైసీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డిని వైసీపీ స్టేట్ అడ్మిన్ హెడ్గా నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాంబశివారెడ్డిని స్టేట్ అడ్మిన్ హెడ్గానూ నియమించినట్లు చెప్పింది. ఈ నియామకంపై సాంబశివారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం చేయడానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.