News January 29, 2025

శ్రీహరికోటకు 75 త్యాళ్ళూరు హైస్కూల్ విద్యార్థులు

image

 తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రాకెట్ ప్రయోగ కేంద్రంలో జనవరి 29వ తారీఖున ఉదయం 6 గంటల 23 నిమిషాలకు ఇస్రో ప్రయోగిస్తున్నారు. జిఎస్ఎల్వి ఎఫ్15 రాకెట్ ప్రయోగంను వీక్షించే అరుదైన అవకాశాన్ని పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం‌ 75త్యాళ్ళూరు హైస్కూల్ విద్యార్థులు బి.భార్గవ్ సాయి రెడ్డి, కె.హెమంత్ సాయి రెడ్డిలు దక్కించుకున్నారు.

Similar News

News November 15, 2025

ఖమ్మం: అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

image

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం నగరం వైరారోడ్ లోని ఎస్.ఆర్ గార్డెన్స్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. అవగాహనతో డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చని చెప్పారు. మధుమేహంపై నిర్లక్ష్యం వహిస్తే ఇది శరీరంలోని అన్ని అవయవాలను దెబ్బ తీస్తుందన్నారు.

News November 15, 2025

ఢిల్లీ పేలుళ్ల ఘటన… అల్ ఫలాహ్ వర్సిటీపై కేసులు

image

ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో ఢిల్లీ పోలీసులు హరియాణా అల్ ఫలాహ్ వర్సిటీపై 2 కేసులు నమోదు చేశారు. UGC, NAACలు వర్సిటీ అక్రమాలను గుర్తించిన తదుపరి మోసం, ఫోర్జరీ, తప్పుడు అక్రిడిటేషన్‌‌లపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా పేలుళ్లకు నేరపూరిత కుట్రకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ వర్సిటీపై ఇంతకు ముందు ఒక కేసును నమోదు చేశారు. పేలుళ్ల నిందితుల వివరాలు సేకరించి విచారిస్తున్నారు.

News November 15, 2025

‘స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలి’

image

బాపట్ల జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించి, చెక్ లిస్ట్ ఆధారంగా కార్యక్రమాలు జరగాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచి మొక్కలు నాటాలన్నారు. ఆధార్ నవీకరణ, సచివాలయ భవనాల పనులు త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు.