News September 24, 2024

శ్రీ చైతన్య ఘటనపై నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్

image

మధురవాడ పరిధిలో మారికవలసలో గల శ్రీ చైతన్య కళాశాల హాస్టల్లో కనీస సదుపాయాలు కల్పించడం లేదని విద్యార్థులు చేసిన ఆర్తనాదాలపై ఏపీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై తక్షణం నివేదిక అందించాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ సభ్యులు గొండు సీతారాం తెలిపారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం అన్నారు.

Similar News

News November 18, 2025

కంచరపాలెంలో 21న జాబ్ మేళా

image

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయం NCSCలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉప ఉపాధి కల్పనాధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. 200 పోస్టులకు మేళా చేపడుతుననట్లు ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖ, విజయవాడ, హైదరాబాద్, చెన్నై‌లో పనిచేయాల్సి ఉంది.

News November 18, 2025

కంచరపాలెంలో 21న జాబ్ మేళా

image

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయం NCSCలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉప ఉపాధి కల్పనాధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. 200 పోస్టులకు మేళా చేపడుతుననట్లు ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖ, విజయవాడ, హైదరాబాద్, చెన్నై‌లో పనిచేయాల్సి ఉంది.

News November 18, 2025

కార్గో రవాణాలో వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

image

వస్తు రవాణాలో మరో మైలురాయిని నమోదు చేస్తూ వాల్తేరు రైల్వే డివిజన్ దేశవ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచింది. 230 రోజుల్లో 50M టన్నుల సరకు రవాణాతో డివిజన్ చరిత్రలోనే అత్యున్నత రికార్డు సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 12.5% పెరుగుదల నమోదైందని రైల్వే శాఖ ప్రకటించింది. స్టీల్‌ప్లాంట్, HPCL, విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్‌ వంటి కీలక లోడింగ్ పాయింట్లలో సదుపాయాల విస్తరణ, కార్యకలాపాల వేగవంతమే కారణమని తెలిపింది.