News January 26, 2025
శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి విద్యుత్ దీపాలతో త్రివర్ణ పతాక అలంకరణ

జనగామ జిల్లాలోని చిల్పూరు గుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి విద్యుత్ దీపాలతో త్రివర్ణ పతాక అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు బుగులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
Similar News
News November 21, 2025
గోదావరిఖని నుంచి కర్ణాటక యాత్ర దర్శన్

గోదావరిఖని డిపో భక్తుల కోసం కర్ణాటక యాత్ర దర్శన్ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. DEC 6 మధ్యహ్నం ఒంటిగంటకు గోదావరిఖని నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి 11న తిరిగి ఇక్కడకు చేరుకుంటుంది. ఈ యాత్రలో హంపి, గోకర్ణ, మురుడేశ్వర, ఉడిపి, శృంగేరి, ధర్మస్థలి, కుక్కి సుబ్రమణ్యస్వామి, మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు. ఒక్కరికి ఛార్జ్ రూ.6,600. వివరాలకు 7013504982 నంబరును సంప్రదించవచ్చు.
News November 21, 2025
డైరెక్షన్పై అల్లరి నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉందని నటుడు అల్లరి నరేశ్ అన్నారు. తాను తెరకెక్కించే సినిమా ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’లా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పారు. తాను నటించిన తొలి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘12ఏ రైల్వే కాలనీ’ అని, వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిందని తెలిపారు. సమాంతరంగా మూడు నాలుగు కథలు జరుగుతుంటాయని చెప్పారు. ‘12ఏ రైల్వే కాలనీ’ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ కానుంది.
News November 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


