News January 26, 2025

శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి విద్యుత్ దీపాలతో త్రివర్ణ పతాక అలంకరణ

image

జనగామ జిల్లాలోని చిల్పూరు గుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి విద్యుత్ దీపాలతో త్రివర్ణ పతాక అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు బుగులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

Similar News

News September 16, 2025

సింగరేణి: ఖనిజ అన్వేషణలకు లైసెన్సులు జారీ

image

కొత్తగూడెం: సింగరేణి సంస్థ కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ చేయడానికి అనుమతిస్తూ.. జారీచేసిన లైసెన్సులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్‌నకు అందజేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని టీ హబ్‌లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక ఖనిజాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెమినార్లో వీటిని అందజేశారు.

News September 16, 2025

ఎల్లారెడ్డిపేట: యాదవ హక్కుల పోరాట సమితి యూత్ జిల్లా అధ్యక్షుడిగా నాగరాజ్

image

యాదవ హక్కుల పోరాట సమితి యూత్ జిల్లా అధ్యక్షుడిగా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రానికి చెందిన మానుక నాగరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొక్కు దేవేందర్, మంగళవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజ్ మాట్లాడుతూ.. యాదవుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

News September 16, 2025

ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా బీర్ల ఐలయ్య

image

జనగామ కలెక్టరేట్లో బుధవారం జరగనున్న ప్రజాపాలన దినోత్సవం ముఖ్యఅతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరు కానున్నారు. ఉదయం 9.58 గంటలకు జనగామ కలెక్టరేట్‌కు చేరుకొని ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రజాపాలన దినోత్సవాలకు కలెక్టరేట్ లో సభా ప్రాంగణం, తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు.